సుదర్శన శతకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: నారయణ → నారాయణ (2), లో → లో , ని → ని (3), మహ → మహ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.
ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా ఉంది. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు, ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామిని యాధాస్థానమున దించవలెనని తలచారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించారు.. అట్లు స్వామిని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము ఉంది.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడిని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించారు.............
ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాషిని శ్రీస్వామివారి భండాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి ' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పటించుచూపఠిoచుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లొకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను ఛేదించినా శ్రీ కూరనారాయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన 'పవన శక్తి ' ని తిరిగి పొందునటూలపొందునటుల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము. ఈ స్తోత్రము పటించువలనపఠిoచు వలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందకే ఆస్తికులందరూ ధర్మార్థ కామ మోక్షాది నిమిత్తమై ఈ స్తోత్రమును పారాయణాదులు జరిపించెదరు.
 
"యస్యస్మరణ మాత్రేణ విద్రవంతి సురారయ:, సహస్రార నమస్తుభ్యం విష్ణు పాణి తలాశ్రయ:" ఎవ్వని స్మరించిన మాత్రముననే అసురరాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో, అట్టి మాహాత్మ్యము గల శ్రీమన్నారాయణుని పాణి తలమున అలంకరించి ఉండు ఓ సహస్రార దేవా ! నీకు నమస్సులు.
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_శతకం" నుండి వెలికితీశారు