[[భౌతిక శాస్త్రంలోశాస్త్రం]]లో నోబెల్ బహుమతిని పొందిన భారత సంతతికి చెందిన రెండవ వ్యక్తి [[సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్|సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్]]. [[సి.వి.రామన్|సర్ సి.వి.రామన్]] లాగానే ఈయన కూడా దక్షిణ భారత దేశానికి చెందినవాడే. ఆయన [[చికాగో విశ్వవిద్యాలయం|చికాగో విశ్వవిద్యాలయ]] పరిశోధన సభ్యులలో ఒకరిగా 1937వ[[1937]]వ సంవత్సరం [[జనవరి]] నెలలో చేరాడు. అప్పటినుంచి చివరివరకూ ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే 60 సంవత్సరాలకు పై ఆ విశ్వవిద్యాలయంలోనే పనిచేసారు. చంద్రశేఖర్ ఇరవై వరకు గౌరవ పట్టాలు పొందారు. ఇరవై ఒక్క ప్రముఖ సంస్థలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983లో[[1983]]లో నోబెల్ బహుమతితో సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ఆయన గౌరవ స్మృతి చిహ్నంగా 1999లో[[1999]]లో [[అమెరికా]] ప్రయోగించిన ‘ఎక్స్రే అంతరిక్ష ఖగోళ దర్శిని’కి ‘చంద్రా’ అని పేరుపెట్టడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.