ఖుదీరాం బోస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[పశ్చిమ బెంగాల్]], [[మిడ్నాపూర్]] జిల్లా హబిబ్‌పూర్‌లో [[1889]] [[డిసెంబర్ 3]]న జన్మించాడు. చిన్ననాటి నుంచి తీవ్రమైన స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరాడు. తన నాయకత్వ లక్షణాలు, సాహసోపేతమైన స్ఫూర్తితో ఆ సంస్థలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి ఆయన టీచర్ సత్యేంవూదనాథ్ బోస్, భగవద్గీత స్ఫూర్తిగా నిలిచాయి. 1905లో బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లను బాంబులతో పేల్చివేశాడు<ref>{{cite news|first1=విలేకరి|title=స్వేచ్ఛ కోసం 19 ఏళ్లకే ప్రాణార్పణం|url=http://telugu.v6news.tv/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9B-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-19-%E0%B0%8F%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE|accessdate=15 August 2017|work=V6 News|date=3 December 2015}}</ref>, <ref>{{cite web|first1=vskteam|title=ఖుదీరాం బోస్ బలిదానం|url=http://vsktelangana.org/khudiram-bose-balidana-divas/|website=VISWAvishwa samvad kendra|publisher=vishwa SAMVADsamvad KENDRAkendra TELANGANATelangana|accessdate=15 August 2017}}</ref>.
 
1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్నికొద్దిదూరంలో నిలబడి చూస్తున్నసుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ళ యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కుమీద ఒక్కగుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్ ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి ఇతడు పెట్టింది పేరు. చిన్నవాడన్నదయలేకుండా సుశీల్ కుమార్ కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీసాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదించాడు.
"https://te.wikipedia.org/wiki/ఖుదీరాం_బోస్" నుండి వెలికితీశారు