దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీదేవీ భాగవత పురాణము''', ఒక శాక్తేయ [[పురాణము]].<ref>శ్రీదేవీ భాగవతము, యామిజాల పద్మనాభస్వామి, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2005.</ref> ఇదీ, మరియు [[మార్కండేయ పురాణము]]లోని [[దేవీ మహాత్మ్యము]] శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.<ref>''The Triumph of the Goddess - The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata PuraNa,'' Brwon Mackenzie. ISBN 0-7914-0363-7</ref> ఇది ఒక [[ఉప పురాణము]] అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది [[మహా పురాణము]] అని ఉంది.<ref>"Thus ends the eighth chapter of the first Skandha in the Mahapurana Srimad Devi Bhagavatam of 18,000 verses by Maharsi Veda Vyasa" [http://www.astrojyoti.com/devibhagavatamindex.htm Srimad Devi Bhagavatam at Astrojyoti]</ref>
 
ఈ గ్రంథాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. 7వ స్కంధంలో 33వ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉంది. 35వ, 39వ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక [[తత్వాలు]], భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది [[త్రిమూర్తులు]] చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.
 
దీని మూలం [[వ్యాసుడు]] రచించిన [[దేవీ భాగవతము]]. ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము.
[[ఫైలు:Sridevibhagavatam.JPG|thumb|250px]]
 
== స్కంధాల విభాగం ==
*'''ప్రథమ స్కంధము''': ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''ద్వితీయ స్కంధము''': ఇందులో [[సత్యవతి (మహాభారతం)|మత్స్యగంధి]], [[పరాశరుడు]], [[వ్యాసుడు]], [[శంతనుడు]], [[గాంగేయుడు]], [[సత్యవతి]], [[కర్ణుడు]], పాండవుల జననం, [[పరీక్షిత్తు]], ప్రమద్వర కథ, [[తక్షకుడు]], [[సర్పయాగం]], జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''తృతీయ స్కంధము''': ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''చతుర్థ స్కంధము''': ఇందులో నరనారాయణులు, ఊర్వశి, ప్రహ్లాదుడు, భృగు శాపం, జయంతి, శ్రీకృష్ణ చరిత్ర మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''పంచమ స్కంధము''': ఇందులో [[మహిషాసురుడు|మహిషుడు]], తామ్రభాషణ, చక్షుర తామ్రులు, అసిలోమాదులతో దేవీ యుద్ధం, రక్తబీజుడు, శుంభ నిశుంభులు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''షష్ఠ స్కంధము''': ఇందులో నహుషుని వృత్తాంతం, అడీ బక యుద్ధం, వశిష్టుని రెండవ జన్మ, నిమి విదేహ కథ, హైహయ వంశం, నారదుడు మొదలైన వాని గురిమ్చి వివరించబడ్డాయి.
*'''సప్తమ స్కంధము''': ఇందులో బ్రహ్మ సృష్టి, సూర్యవంశ కథ, సుకన్య చ్యవనుల చరిత్ర, రేవతుడు, శశాదుడు, మాంధాత, సత్యవ్రతుడు, [[త్రిశంకు స్వర్గం]], [[దక్షయజ్ఞం (అయోమయ నివృత్తి)|దక్షయజ్ఞం]], దేవీ స్థానాలు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''అష్టమ స్కంధము''': ఇందులో ఆదివరాహం, ప్రియవ్రతుడు, సప్తద్వీపాలు, కులపర్వతాదులు, ద్వీపవృత్తాంతం, సూర్యచంద్రుల స్థితగతులు, శింశిమార చక్రం, అధోలోకాలు, నరకలోక, దేవీపూజ, మధూక పూజావిధి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''నవమ స్కంధము''': ఇందులో పంచశక్తులు, పంచ ప్రకృత్యాదుల కథ, కృష్ణుని సృష్టి, సరస్వతీ పూజ, కవచం, స్తుతి, కలి లక్షణాలు, గంగోపాఖ్యానం, వేదవతి, తులసి చరిత్ర, స్వాహా, స్వధ, దక్షిణ, షష్ఠీదేవి, సురభి, రాధా స్తోత్రం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.
*'''దశమ స్కంధము''': ఇందులో వింధ్య గర్వాపహరణ, మనువులు భ్రామరి గురించి వివరించబడ్డాయి.
*'''ఏకాదశ స్కంధము''': ఇందులో సదాచారం, [[రుద్రాక్ష]] కథ, జపమాల, శిరోవ్రతం, సంధ్య, గాయత్రీ ముద్రలు, దేవీ పూజాదులు గురించి వివరించబడ్డాయి.
* '''ద్వాదశ స్కంధము''': ఇందులో గాయత్రీ విచారము, కవచము, [[హృదయము]], [[స్తోత్రము]], సహస్రనామ స్తోత్రము, గాయత్రి దీక్షా లక్షణము, గౌరముని శాపము, మణిద్వీపం, దేవీ భాగవత ప్రశస్తి గురించి వివరించబడ్డాయి.
 
== తెలుగులో దేవీ భాగవతం గ్రంథాలు ==
దేవీ భాగవతాన్ని అనేకులు తెలుగులో పద్యరూపంలోను, వచన రూపంలోను, యధానువాదరూపంలోను ప్రచురించారు. అటువంటి కొన్ని గ్రంథాల వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
* [[ములుగు పాపయారాధ్యులు]] [[వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు]] సంస్థానంలో ఆస్థానకవిగానున్న కాలంలో దేవీభాగవతాన్ని మొదటిసారిగా తెలుగులోనికి[[తెలుగు]]<nowiki/>లోనికి అనువదించారు.
* '''[[యామిజాల పద్మనాభస్వామి]]''' రచన - "శ్రీ దేవీ భాగవతము''' - బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు,
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడింది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు