పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
ఈయన [[ఆగష్టు 21]] [[1914]] సంవత్సరంలో [[విజయవాడ]]లో [[కృష్ణాష్టమి]] రోజున జన్మించారు.
 
చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని నరసింహశాస్త్రి]] వద్ద గాత్రం, [[హార్మోనియం]] వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత [[కాకినాడ]] మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో [[మెట్రిక్]] చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో[[1950]]లో [[బి.ఎ.సుబ్బారావు]] నిర్మించిన [[పల్లెటూరి పిల్ల]] చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి [[అంజలీదేవి]] పేరుతో 1953లో[[1953]]లో [[అంజలీ పిక్చర్స్]] స్థాపించారు. 1955లో[[1955]]లో నిర్మించిన [[అనార్కలి]] చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం ఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన [[సువర్ణసుందరి]] తెలుగు, [[తమిళ]], [[హిందీ]] భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. [[సతీ సక్కుబాయి]] వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/పి.ఆదినారాయణరావు" నుండి వెలికితీశారు