త్రిజట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →ప్రస్తావన |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Trijatha solo.jpg|thumb|right|200px|త్రిజట]]
'''[[త్రిజట]]''', [[రామాయణం]]లో ఒక వృద్ధ రాక్షస స్త్రీ పాత్ర. [[రావణుడు]] [[సీత]]ను ఎత్తుకొని పోయి [[లంక]]<nowiki/>లో బంధించి, ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు [[శ్రీరాముడు]] [[సముద్రము]] దాటివచ్చినట్లు, [[రావణుడు]] [[యుద్ధం]]<nowiki/>లో చనిపోయినట్లు [[కల]] వస్తుంది. [[సుందర కాండ]]లో త్రిజట స్వప్న వృత్తాంతం గురించి ఉంది. త్రిజట [[విభీషణుడు|విభీషణుని]] కూతురు అని అంటారు గాని ఇది సరి కాదని [[గుంటూరు శేషేంద్ర శర్మ]] వ్రాశాడు. గోవిందరాజీయములో "త్రిజటా విభీషణ పుత్రీ" అన్న పదాలను తప్పుగా విడదీయడం వలన ఈ అర్థం వచ్చిందని అతని భావన. (త్రిజట, మరియు [[విభీషణుడు|విభీషణు]]<nowiki/>ని కూతురు అని ఇద్దరిని సూచించే వాక్యంగా ఈ శ్లోక భాగాన్ని అర్థం చేసుకోవాలి - అని రచయిత భావం). విభీషణుని కూతురు పేరు "నల". త్రిజట వృద్ధురాలైన వనిత గనుక విభీషణుని కూతురు కానేరదు. [[వాల్మీకి]] రచనలో "త్రిజటా వృద్ధా ప్రబుద్ధా వాక్యమబ్రవీత్" అని ఉంది.<ref name="shodasi">[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితఙయన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000</ref>
==సుందరకాండలో==
కామాతురుడైన [[రావణుడు]] సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. [[సీత]] ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు.
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని [[రావణుడు]] మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని [[గొడుగు]]<nowiki/>తో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి [[ఆకాశం]]లో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై
ఇలా చెప్పి, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు త్రిజట హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.
పంక్తి 16:
వారందరూ సీతను [[పుష్పక విమానం]]పై తీసుకొని వెళ్ళి యుద్ధరంగంపైన ఆపారు. దే్హమంతా బాణాలు కప్పివేయగా నేలపైబడియున్న రామలక్ష్మణులను చూచి సీత విలపించసాగింది. అప్పుడు సీతను త్రిజట ఇలా ఊరడించింది-
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ [[భర్త]] విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక [[రాముడు|రామ]] [[లక్ష్మణుడు|లక్ష్మణులు]] బ్రతికే ఉన్నారని కచ్చితంగా చెప్పగలను. ఇదంతా నేను నీమీది స్నేహంతో చెబుతున్నాను. నేను ఏనాడూ అబద్ధం ఆడను. నీవు శీలవతివి గనుక నా మనసును ఆకర్షించావు - అని సీతను అనునయించింది. సీత తన [[చేతులు]] జోడించి ''నీ మాటే సత్యం కావాలి'' అంది.
==ప్రస్తావన==
ర|| విభీషణుని కూతురు. సీత రావణునిచేత పట్టువడి ఉండు [[కాలము]]<nowiki/>న ఈమె సీతకు మిగుల ఊఱటమాటలు చెప్పుచు ఉండెను. ఒకప్పుడు రావణుని నాశమునకు సూచకమైన కల ఒకటి కని రాక్షసస్త్రీలు చేయు నిర్బంధములచే మిగుల ఖిన్నురాలై ఉండిన సీతకు ఆస్వప్నవృత్తాంతము చెప్పి శీఘ్రకాలములో రాముఁడు రావణుని నశింపజేసి ఆమెను తోడుకొనిపోవును అని ఈమె సమాధాన పఱచెను.
|