రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
<!-- [[ ]] -->
'''భద్రాచల [[రామదాసు]]''' (''Ramadasu'') గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు '''కంచెర్ల గోపన్న''' (''Kancherla Gopanna''). [[1620]] లో, [[ఖమ్మం జిల్లా]] [[నేలకొండపల్లి]]లో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, '''[[భక్త రామదాసు]]''' గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో [[కీర్తన]]లకు ఆద్యుడు. [[దాశరధి]] [[శతకము]], ఎన్నో రామ సంకీర్తనలు, [[భద్రాచలం]] దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. ([[కబీర్ దాసు]] గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)
 
== ఉద్యోగమునకై మేనమామల సహాయం==
పంక్తి 47:
 
==గోపన్నకు జైలు శిక్ష==
కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. [[గోల్కొండ కోటలోకోట]]<nowiki/>లో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.
ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి [[శ్రీరాముడు|శ్రీ రాముని]] కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి, మరలా - "ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు. అతను [[సీత|సీతమ్మ]] వారికి చేయించిన చింతాకు పతకము, [[లక్ష్మణుడు|లక్ష్మణునకు]] చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి [[ఆభరణాలు]] ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.
 
== రామ లక్ష్మణుల తిరిగి చెల్లింపు==
అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని[[భూమి]]<nowiki/>ని ఇచ్చారు. శ్రీ [[సీతారామ కళ్యాణం|సీతారామ కళ్యాణ]] సమయంలో [[గోల్కొండ]] దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.
 
==వాగ్గేయకారులలో ఆధ్యుడు==
"https://te.wikipedia.org/wiki/రామదాసు" నుండి వెలికితీశారు