సభాపతయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
{{భారతీయ సంగీతం}}
 
తంజావూరునకు[[తంజావూరు]]<nowiki/>నకు సమీపమున నెలకొనిన [[తెలుగు]] కుటుంబములలో[[కుటుంబము]]<nowiki/>లలో [[త్యాగయ్య]] కుటుంబమును, సభాపతయ్య కుటుంబమును ప్రసిద్ధములు. [[త్యాగయ్య]] రామభక్తుడై, పరమ భాగవతమోత్తముడై, కీర్తనలు రచించి, [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] సంగీతమునకు ప్రవర్తకుడు కాగా, సభాపతయ్య రాజగోపాలభక్తుడై, మన్నారుగుడిలో [[క్షేత్రయ్య]] పదములను, సంప్రదాయ సిద్ధముగా పాడి, అభినయించుచు తత్సంప్రదాయ ప్రవర్తకుడగుట మాత్రమేగాక, స్వయముగా తన ఇష్ట దైవమైన రాజగోపాల నామాంకితములుగా క్షేత్రయ్య పదములను పోలిన పదములను రచించి పద రచయితగా[[రచయిత]]<nowiki/>గా బదాభినయ ప్రవర్తకుడిగా ప్రఖ్యాతిగాంచినాడు.
 
[[సభాపతయ్య]], త్యాగయ్య వలెనే ములకనాటి [[వైదిక]] శాఖకు చెందిన [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుడు]]. తంజావూరునకు సమీపమున మూవనల్లూరను బ్రాహ్మణాగ్రహారము ఇతని స్వగ్రామము. అక్కడే సమీపమున మన్నారుగుడి యందలి రాజగోపాలస్వామికి భక్తుడైనాడు. అతని మీద శృంగార పదములను రచించినాడు. అతని స్వగ్రామము వలననే ఇతని పేరు మూవనల్లూరు సభాపతయ్య అని, మన్నారుగుడిలో చాలకాలము నివసించుటచే రాజమన్నురుగుడి సభాపతయ్య అని వ్యవహరింపబడుచుండెను.
 
భరతశాస్త్రమందు ఈయన మహా ప్రావీణ్యుడు. ఈయన సుమారు సం.1860 ప్రాంతము వాడని చెప్పవచ్చును. ఈయనను గురించిన ఇతర విశేషములేవి తెలియలేదు. ఈయన శృంగారపదములనే గాక '''సీతాస్వయంవరము''' ను పాటలలో రచించెను. ఈయన రచనలలో పలుచోట్ల [[తమిళ భాష|తమిళ]] [[పదములు]] కనబడును. ఈయనను గూర్చి ఈ క్రింది కథ ప్రచారమున నుండినది:
 
సభాపతయ్య సంగీతాభినయ శాస్త్రములలో మహావిద్వాంసుడు. ఈయన స్త్రీవేషము వేసి క్షేత్రయ్య పదములను పాడి అభినయించువాడు. సహజముగనే సుందర శరీరుదయి, చక్కని శారీరముగల సభాపతయ్య [[స్త్రీ]] వేషమున ప్రేక్షకులను సులభముగా ఆకట్టుకొనేవాడు. ఒకప్పుడు శరభోజి [[మహారాజు]] భరతశాస్త్రాభినయములో మేటిఅయిన వారేది కోరినను వారి అభీష్టము తీర్చి సత్కరించెదనని పలుకగా అనేకులు స్త్రీలు, పురుషులు తమ అభినయమును చూపి రాజసన్మానము పొందిరట. అపుడు సభాపతయ్య స్త్రీ వేషముతో సభారంగమున నిలిచి స్త్రీ వాక్యముగా పదముపాడి [[నాట్యము]] చేయగా రాజుతో సహా అందరు ఆశ్చర్యమునొందిరట. పరమభాగవతోత్తముడైన సభాపతయ్య రాజాంతఃపురమున అనాదిగా వంశ పరంపరాను గతముగా పూజింప బడుచుండిన ఒక శ్రీకృష్ణుని విగ్రహమును[[విగ్రహము]]<nowiki/>ను తనకివ్వమని రాజును ప్రార్ధించిరట. రాజు దానికి ఆశ్చర్యము నొంది దీనిని నీవేమి చేసుకొందువని ప్రశ్నించగా, మహారాజా ధనము నాకక్కర లేదు. అది అశాశ్వతము. శ్రీకృష్ణానుగ్రహమున నేను నేర్చిన విద్యను పదిమందికి నేర్పి దానిలోనే నేను ఆనందము పొందుచున్నాను. మీరు దయతో ఆవిగ్రహమును నాకొసగిన దానిని నా దేవతార్చనలో నుంచుకొని ప్రతిదినము పూజింతునని చెప్పెనట. రాజు ఆయన కోరికలోని తీవ్రతను గుర్తించి సభాతయ్యను సత్కరించి ఆవిగ్రహమును బహూకరించెనట.
 
సభాతయ్య రాజగోపాల నామాంకితములుగా రచించిన శృంగారపదములు 50 మాత్రము క్రీ.శ. 1884 సం.లోఅ.స.నృసింహాచార్యులవారి శ్రీవాణీ నిలయ ముద్రాక్షరశాలయందు ముద్రింపబడినవి. ఇందలి పదములకు నీ.మా తిరుపతి వేంకటాచార్యులవారు సంగ్రహించిన ఆంద్రవాక్యరూపమున నాయకా నాయకాది లక్షణములను, రసమంజరి ఉదాహరణ శ్లోకములను ఒసగబడినవి.
పంక్తి 99:
 
అంగజ జనకా నిను దలచినదే
అటే [[శరీరం|దేహము]] పరవశ మయ్యేనిరా
పొంగి గుబ్బలివో పులకరించేనిరా
భోగి శయన మంచి సమయ మిదిరా ||రారా||
పంక్తి 113:
జోకతోడ నీలోక మె మరతురా ||రారా||
 
భరతనాట్యాచారుడై సంప్రదాయ సిద్ధముగా పదములను పాడి, అభినయించి పదకవితకు ప్రాణము పోసి ప్రచారమునకు తెచ్చుటతో బాటు భాగవతులను తన సంగీతాభినయములచే రసానందభూతికి దార్చుట మాత్రమే గాక, స్వయముగా పదములను రచించి తరువాతి కాలము వారికి గూడ అట్టి రసానుభూతి కల్పించి పదరచయితయై ప్రఖ్యాతి గాంచిన సభాపతయ్య [[తెలుగు]] వారికి చిరస్మరణీయుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సభాపతయ్య" నుండి వెలికితీశారు