ఏనుగు లక్ష్మణ కవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
[[ఏనుగు లక్ష్మణ కవి]] గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797) చెందిన వారు. కవిగారి తల్లి గారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము [[పెద్దాపురము]] (ప్రస్తుత [[తూర్పుగోదావరిజిల్లా]]లోనితూర్పుగోదావరిజిల్లాలోని [[సామర్లకోట]]కు దగ్గరులో వున్నది). శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాత గారు "శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు". ఈయన పెద్దాపుర సంస్థానీసాధీశ్వరుల యొద్ద నేనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి యింటిపేరు "పైడిపాటి" నుండి "ఏనుగు" వారిగా స్దిర పడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనుమడు '''[[ఏనుగు లక్ష్మణ కవి]]'''. ఈ వంశము కవుల వంశముగనే కనబడుచున్నది. శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ధ కవి 'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణకవి గారి సమ కాలికుడు.లక్ష్మణ కవిగారు, [[భర్తృహరి]] సంస్కృతంలో రచించిన [[సుభాషిత త్రిశతి]] తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీద అనువాదం చేసాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. [[భర్తృహరి]] సుభాషితములను [[తెలుగు]]లోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. '''ఏనుగు లక్ష్మణ కవి''' 2. [[పుష్పగిరి తిమ్మన]] 3. [[ఏలకూచి బాలసరస్వతి]]. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.
 
ఈ సుభాషిత రత్నావళిని అతి మనోహరముగ, యథామూలముగ, ప్రౌఢముగ, సందర్భసముచిత శైలిలో కవి హృదయమును గ్రహించి రచియించె ననుట పెద్దల యభిప్రాయము. కాని దీని యెడల లోటుపాటులు ఉన్నాయి. పద్యములు రసవంతముగ నుండుటకు వానిని పండితులును పామరులును గూడ పఠించు చుండుటయే సాక్ష్యము.
"https://te.wikipedia.org/wiki/ఏనుగు_లక్ష్మణ_కవి" నుండి వెలికితీశారు