బడగనాడు శాఖకు చెందిన మధ్వ [[బ్రాహ్మణ]] కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు '''[[కలుగోడు అశ్వత్థరావు]]''' ([[జూలై 25]], [[1901]] - [[జూలై 19]], [[1972]]) <ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - రెండవసంపుటి - [[కల్లూరు అహోబలరావు]]</ref> [[1901]] వ సంవత్సరం [[జూలై 25]] వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో [[తెలుగు]] [[కన్నడ]] భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. [[రాయదుర్గం]] తాలూకా [[కలుగోడు]] లోను, [[కర్ణాటక]] రాష్ట్రం [[చిత్రదుర్గ]] జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి[[భూములు]]<nowiki/>న్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది. ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు. తన గ్రంథాలను ప్రచురించుకొనడానికి స్వంతంగా [[రాయదుర్గం]]లో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు.