కాణాదం పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[కాణాదం పెద్దన]] ''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లో ''విద్వద్గద్వాల ''గా విశిష్ట సాహిత్య పోషణా సంస్థానంగా పేరొందిన [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానపు]] ప్రభువుల ఆస్థాన కవి. సాహిత్య పోషణలో [[గద్వాల]] రాయలుగా పేరు తెచ్చుకున్న [[రాజా చిన సోమభూపాలుడు|చిన సోమభూపాలుడి]] ఆస్థాన [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజ]] కవులలో అగ్రగణ్యుడు. గద్వాల అల్లసాని పెద్దనగా భాసిల్లిన కవి. ఆశు, బంధ, గర్భ, చిత్ర వంటి కవిత్వంతో మెప్పించిన చతుర్విద కవితావిశారదుడు.
== వంశం ==
పెద్దన ''కాణాదం'' వంశం వాడు. నంద వరీక [[బ్రాహ్మణుడు]]. ఆత్రేయస గోత్రుడు. ఇతని పినతండ్రి [[తిమ్మనార్యుడు]]. భోజుని చంపూ రామాయణానికి వ్యాఖ్యానం రాసిన [[మల్లేశ్వర దీక్షితులు]] ఇతనికి విద్యాగురువు<ref>15వ పద్యం, అవతారిక, ముకుందవిలాసం, రచన- కాణాదం పెద్దన</ref>.
== గద్వాల సంస్థానానికి ఆగమనం ==
పెద్దన పూర్వం [[సురపురం సంస్థానం|సురపురం సంస్థానపు]] ఆస్థాన పండితులుగా ఉండి, ఆంధ్రమత్స్య పురాణాన్ని రచించిన చిన సోమభూపాలుడి పినతండ్రి ఐన రాజా [[రామరాయలు]](క్రీ.శ. 1768-83) కాలంలో [[గద్వాల]]సంస్థానానికి విచ్చేసి, తర్వాత చిన సోమభూపాలుడి(క్రీ.శ. 1784-1815)అస్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడిగా ఘనతికెక్కాడు.
పంక్తి 49:
=== ముకుందవిలాసం ===
{{main|ముకుందవిలాసము}}
'''ముకుందవిలాసం'' ఒక ప్రసిద్ధిచెందిన తెలుగు [[ప్రబంధం]]. ముకుందుడు అనగా [[శ్రీకృష్ణుడు]]. కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన [[భద్రాదేవి]]తో శ్రీకృష్ణునికి జరిగిన [[పెళ్ళి|వివాహం]] ఇందులోని ప్రధానమైన ఇతివృత్తం. అందువలన దీనికి '''భద్రాపరిణయం''', '''భద్రాపరిణయోల్లాసం''' అని నామాంతరాలు ఉన్నాయి. ఇది మూడాశ్వాసాల ప్రబంధం. ఇది తొలిసారి క్రీ.శ. [[1886]]లో [[గద్వాల]] సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. తరువాత తెలుగు విజ్ఞానపీఠం వారు ఈ ప్రబంధాన్ని [[1985]]లో ముద్రించారు. చిన సోమభూపాలుడి కోరిక మేరకు ఈ గ్రంథాన్ని రచించి [[గద్వాల]] లోని కేశవస్వామికి అంకితం చేయబడింది. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపిస్తాయి.
 
=== ఆధ్యాత్మ రామాయణం ===
ఇది పెద్దన రెండవ రచన. ఈ గ్రంథం క్రీ.శ> [[1873]]లో గద్వాల సాహిత్య ముకుర ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. ఈ గ్రంథానికి మూలం [[ఆగస్త్యుడు]] రచించిన ఆధ్యాత్మ రామాయణం. ఈ గ్రంథంలో పెద్దన గద్వాల ప్రభువుల ఇలవేల్పగు చెన్నకేశవస్వామిని కీర్తించాడు. ఈ స్వామికే ఈ గ్రంథం అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. ఈ గ్రంథానికి, ఇతర రామాయణాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సీతారామ హనుమత్సంవాద రూపమైన రామ హృదయాన్ని పరమశివుడు పార్వతికి తెలుపుట ఇందలి విశేషం. రామ హృదయాన్ని కవి రామగీత తత్వంగా ఇందులో పేర్కొన్నాడు. ఈ గ్రంథమునందు శబ్ధాలంకారాలు కోకొల్లలు.
===యధాశ్లోక తాత్పర్య రామాయణం ( బాలకాండం) ===
గద్వాల సంస్థానంలో [[వాల్మీకి]] [[రామాయణం|రామాయణాన్ని]] ''యధాశ్లోక తాత్పర్య రామాయణం'' పేరుతో ఆరుగురు కవులు అనువాదం చేశారు. ఇది గద్వాల సంస్థానం వారి చెన్నకేశవ ముద్రాణాలయంలో రెండు సంపుటులుగా వెలువడింది. దీనిలో పెద్దన కవి ''బాలకాండ ''ను అనువాదం చేశాడు. తన రచనలో పెద్దన కవి [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థాన]] ప్రభువుల పూర్వపు స్థానమైన [[పూడూర్(గద్వాల)|పూడూర్]] చెన్నకేశవస్వామిని స్తుతించాడు. పెద్దన కవి బాలకాండను మూడాశ్వాసాల కావ్యంగా మలిచాడు.
 
''అల కణాదము పెద్దనాధ్వరి దనరించు
పటు చమత్కృతులతో [[బాలకాండ]]'' అని రామాయణాన్ని అనువాదం చేసిన గద్వాల కవుల గురించి చెప్పన పద్యంలో ఉంది.
 
== పెద్దన రచనా రీతి ==
"https://te.wikipedia.org/wiki/కాణాదం_పెద్దన" నుండి వెలికితీశారు