చల్లా రాధాకృష్ణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆచార్య [[చల్లా రాధాకృష్ణ శర్మ]]''' (1929 - 1999) ప్రముఖ [[రచయిత]], [[కవి]], విమర్శకుడు, బహుభాషావేత్త, బాల సాహిత్య రచయిత మరియు అనువాదకులు.
==జీవిత విశేషాలు==
వీరు కృష్ణా జిల్లాలోని [[సోమవరప్పాడు]] గ్రామంలో 6 – 1 – 1929 న జన్మించారు.శర్మ తండ్రి సాంస్కృతాంధ్రాలలో, హిందీలో[[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో అపారమైన పాండిత్యం గలవారు, అష్టావధాని, బహు గ్రంథ కర్త అయిన చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి . తల్లి అన్న పూర్ణకునుద్దియైన యశోదమ్మ.
==విద్యాభ్యాసం ==
ఈయన నాల్గవ తరగతి వరకు [[బందరు]]లో చదివారు. [[మద్రాసు]]కు ఇరవై మైళ్ళ దూరంలో [[చెంగల్పట్టు]] జిల్లాలోని పోన్నేరి గ్రామంలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివి ఆ తర్వాత [[నెల్లూరు]] వి.ఆర్. కళాశాలలో ఎం.పి.సి గ్రూపుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యాడు. తెలుగు సాహిత్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని బి.ఎ చదివి 1950 లో డిగ్రీ పొందారు. నెల్లూరులో విద్యార్థిగా ఉండిన శర్మ ప్రాచ్య భాషా పరిషత్ కు కార్యదర్శిగా పనిచేశారు.
నెల్లూరులో [[దర్భా వెంకట కృష్ణమూర్తి]], [[ధరణికోట వెంకట సుబ్భయ్య]], [[పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి]], నేలటూరి రామ దానయ్య, గుంటూరులో జమ్మలమడక మాధవరామశాస్త్రి వంటి హేమా హేమీలు గురువులుగా లభించటం అదృష్టంగా పొంగిపోయేవాడు. చల్లా శర్మ [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ తెలుగు పూర్తి చేశాడు. [[నిడదవోలు వెంకటరావు]] పర్యవేక్షణలో “ Tamil element in telugu literature ’’ అనే అంశంపై పరిశోధన చేసి ఎం.లిట్ పొందారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుంచే పర్యవేక్షకులు లేకుండా స్వయంగా “ The Ramayana in telugu and tamil- a comparative study ‘’ అనే అంశంపై పరిశోధన చేసి ఆచార్య [[పింగళి లక్ష్మీ కాంతం]] పరీరక్షకులుగా పి.హెచ్.డి పొందారు. శర్మ మొదట్లో [[సత్యవేడు]] గ్రామంలో ఉన్నత పాఠశాలలో సైన్సు టీచర్ గా, తరువాత మద్రాసు సర్. త్యాగరాయ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు . 1957 నుంచి మద్రాసు లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]] ప్రాంతీయ కార్యాలయం కార్యదర్శిగా ఇరవై నాలుగు సంవత్సరాలు పని చేశారు . 1981 నుంచి [[మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం]]లో తెలుగు శాఖాధ్యాక్షులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .
 
ఉన్నత విద్యాభ్యాసం అనంతరం మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో చాలాకాలం ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు తమిళం నుండి చాలా పుస్తకాల్ని అనువాదం చేశారు. పిల్లల కోసం అనగా, అనగా, బెకబెకలు, అన్నదమ్ములు, [[దయావీరులు]], అంతా ఒక్కటే, శ్రీసాయి కథామృతం అనే కథా సంకలనాలను వెలువరించారు. వాన కురిసింది, చందమామ అనే గేయాల పుస్తకాలు రాశారు. ప్రసిద్ధ వ్యక్తులను ' చరిత్ర కెక్కిన చరితార్థులు ' అనే పేరుతో మూడు భాగాలుగా పిల్లలకు పరిచయం చేశారు. దీనిలో భారతదేశానికి చెందిన ఎందరో ప్రసిద్ధిచెందిన మహాపురుషుల పరిచయాలు ఉన్నాయి. జయదేవుడు జీవితచరిత్ర రాశారు.
 
తమిళ భాషలో ప్రసిద్ధిచెందిన కొన్ని పిల్లల పుస్తకాలను కూడా తెలుగు బాలలకు పరిచయం చేశారు. చిట్టికి చిరుగంట, కడుపులో గారడీ, అడవి ఏనుగు కథ, టైం ఎంతయింది, దారిచూపిన తాత గాంధీ, భారతి చెప్పిన పిల్లల కథలు, బాల రామాయణం, భారతి జీవిత కథ, రంగు రంగుల పూలు చెప్పుకోదగ్గవి. ఆంగ్లంలో పిల్లల కోసం రాసిన కథల పుస్తకం టేల్స్ ఫ్రమ్‌ తెలుగు (1975) [[మరాఠీ భాష|మరాఠీ]], [[మలయాళ భాష|మళయాళం]], [[తమిళ భాష|తమిళం]], హిందూ[[హిందీ భాష|హిందీ]] భాషలలోకి అనువాదం అయింది.
 
వీరు ఎన్నో సమావేశాలలో సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. పత్రికలలో వ్యాసాలు ప్రకటించారు.
సాహిత్య అకాడమీలో ఉండటం వల్ల శర్మకి అనేక భాషాల కవులతో , రచయితలతో పరిచయాలు ఏర్పడాయి. శర్మ లోకజ్ఞత , పరిశీలనాదృష్టి విస్తరించాయి.
గుడివాడ వాస్తవ్వులైన చింతలపాటి కామయ్య శాస్తీ కుమార్తే సుశీలతో శర్మ [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ముగ్గురమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలతో ఆదర్శ జీవితాన్ని గడిపారు . శర్మ హై స్కూల్ విద్యార్ధిగా ఉండగా ఒక సభలో ఒక ప్రసిద్ధి తమిళ పండితుడు తమిళ భాష చాలా గొప్పదని ప్రసంగిస్తూoటే శర్మ లేచి “మా తెలుగే గొప్పది ” అన్నారట .
శర్మ డిల్లిలో కేంద్రసాహిత్య అకాడమీలో పనిచేస్తున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మాత్తుగా అకాడమి కార్యాలయానికి వచినప్పుడు శర్మ నెహ్రుతో కరచాలనం చేసి మాట్లాడటం ఒక మధురానుభూతిగా మిగిలిందని పరవశించి పోయారు శర్మ .