[[ఇల్లిందల సరస్వతీదేవి]](1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన తొలి తెలుగు రచయిత్రి.
== వ్యక్తిగత జీవితం ==
ఇల్లిందల సరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆపై [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్వయంకృషితో [[ఇంగ్లీషు]], [[హిందీ]] నేర్చుకున్నారు. <ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97| బహుభాషాకోవిదులైన తెలుగు రచయితలు </ref>. [[జర్నలిజం]]లో డిప్లమా పొందారు. <ref>ఆంధ్రరచయిత్రుల సమాచార సూచిక. సం. [[కె. రామలక్ష్మి]]. ఆం. ప్ర. సాహిత్య ెకాడమీ. 1968.</ref>
== రచన రంగం ==
ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, [[రేడియో]] నాటికలు రచన చేశారు. [[కృష్ణాపత్రిక]]లోకృష్ణాపత్రికలో ''ఇయంగేహేలక్ష్మీ'', ఆంధ్రపత్రికలో[[ఆంధ్రపత్రిక]]<nowiki/>లో ''వనితాలోకం'' శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. కథాసంకలనాలు వెలువరించారు.<ref>సామాజిక సాహిత్యవేత్త:తె.వె.బృందం:[[తెలుగు వెలుగు]]:మార్చి 2014:పే.22,23</ref>
తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో [[హైదరాబాదు]]లో ''[[ఆంధ్ర యువతి మండలి]]''ని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు [[జైలు]] విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.