కాత్యాయని విద్మహే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, డిసెంబర్ → డిసెంబరు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''[[కేతవరపు కాత్యాయనీ విద్మహే]]''' అభ్యుదయ రచయిత్రి. ఈమె [[కాకతీయ విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
 
==జీవిత విశేషాలు==
ఈమె [[1955]] [[నవంబర్ 3]] న [[ప్రకాశం జిల్లా]] [[మైలవరం (అద్దంకి)]] గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, [[రామకోటిశాస్త్రి]] దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే [[తెలుగు]] విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది [[మైలవరం]]లోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా [[వరంగల్‌]]లోనే. ఆమె [[మొగిలిచెర్ల (గీసుకొండ)]] గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును [[పెళ్ళి|వివాహం]] చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా [[తెలుగు]] సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. అందుకు అనుగునంగా [[కాకతీయ విశ్వవిశ్వవిద్యాలయము|కాకతీయ విద్యాలయంవిశ్వవిద్యాలయం]]<nowiki/>లో పిహెచ్ డి డిగ్రీ పొందారు. వారికి ఒక [[కూతురు]] ఉంది. 12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య [[వరంగల్‌]]లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, [[ఎం.ఏ]] [[తెలుగు]] కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు.
 
==సాహిత్యం, ఉద్యమాలు==
కేతవరపు కాత్యాయనీ విద్మహే అభ్యుదయ రచయిత్రి.కాకతీయ . ఆమె రాసిన ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]], తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి [[వట్టికొండ విశాలాక్షి]], విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన [[రంగవల్లి]]కి అంకితం చేశారు.
 
కాకతీయ యూనివర్సిటీలో [[1977]]లో అధ్యాపకురాలుగా ప్రవేశించి [[1998]] సంవత్సరంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు.1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. ఆమె ‘తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత’, [[‘తెలుగుతెలుగు]] నవలాకథానిక విమర్శ పరిణామం’, ‘ఆధునిక [[తెలుగుసాహిత్యం]] స్త్రీవాద భూమిక’ వంటి ఎన్నో రచనలు చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కార తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు. తన తండ్రి రామకోటిశాస్త్రి రాసిన సాహిత్య వ్యాసాలను 22వరకు పుస్తకాలుగా ప్రచురింపచేశారు. [[1992]]నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అక్టోబరు 28న తనతండ్రి వర్థంతిరోజు తప్పనిసరిగా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు.తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పాల్కంపెల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు, తెలంగాణ పోరాట నాటకంపై పీహెచ్‌డీ స్థాయి పరిశోధనలు కూడా చేయించారు. విప్లవ పోరాటాల ప్రభావంతో గళమెత్తిన స్త్రీల గురించి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢవిశ్వాసాలను ప్రశ్నిస్తూ వివిధ రచయిత్రుల రచనలను పరిచయం చేశారు.
 
కాత్యాయని ఇప్పటి వరకూ 20 పుస్తకాలు రాశారు. వాటిల్లో సాహిత్యాకాశంలో సగం, స్త్రీల కవిత్వం, కథ, అస్తిత్వ చైతన్యం, తదితర పుస్తకాలు అవార్డు పొందడానికి కారణమయ్యాయి. సాహిత్యాకాశంలో సగం పుస్తకంలో సుమారు 28 మంది మహిళా రచయితల వ్యాసాలను చేర్చారు. వీటితోపాటు వివిధ పుస్తకాలు, సాహితీ ధోరణులపై వెల్లడించిన సమీక్షలు, వివిధ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు.
పంక్తి 57:
<ref>http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784</ref>
 
[[తెలుగు సాహిత్యంలోసాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లో విశేష కృషిచేసిన కాత్యాయని విద్మహేకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. తెలుగులో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' అనే వ్యాస సంకలనానికి ఈ పురస్కారం లభించింది. ఆమె వరంగల్‌లోని [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయంలోనివిశ్వవిద్యాలయం]]<nowiki/>లోని తెలుగు డిపార్ట్‌మెం ట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబరు 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్‌కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్‌జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు. - See more at: http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కాత్యాయని_విద్మహే" నుండి వెలికితీశారు