తెన్నేటి హేమలత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[లత]]''' గా ప్రసిద్ధిచెందిన '''తెన్నేటి హేమాలత''' [[విజయవాడ]]కు చెందిన [[నవల|నవలా]] [[రచయిత్రి]] . నవలా రచనలలో ఉత్కృష్టమైనవి చాలా ఉన్నాయి. [[పాంచాలి]] పేరుతో ఒక నవలను వ్రాసారు. [[ద్రౌపది]] అంతరంగాన్ని [[స్త్రీ]] కోణంలో చూపే భారత నవలగా దీనిని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం అందుబాటులో లేదు. 70 వ దశకం, 80 వ దశకం లలో ఈవిడ [[సాహిత్యం]] పై ఎన్నో చర్చలు జరిగాయి. ఈవిడ రాసిన ''[[రామాయణ విషవృక్ష ఖండన]]'' ప్రసిద్ధ రచన.
 
==జీవితం==
నవంబరు 15, 1935 న [[విజయవాడ]]లో నిభానుపూడి విశాలాక్షి మరియు నారాయణరావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రమాకృష్ణవేణి హేమలత అని నామకరణం చేసారు. ఐదవ తరగతి వరకూ బడిలో[[పాఠశాల|బడి]]<nowiki/>లో చదువుకుని, ఆపైన [[తెలుగు]], [[సంస్కృతం]] మరియు [[ఆంగ్లం]] ఇంటి వద్దనే చదువుకున్నారు. తొమ్మిదోయేట ఆమెకు తెన్నేటి అచ్యుతరామయ్యతో [[వివాహం]] జరిగింది. ఆ సమయానికి అతడు ఆమెకన్నా ఏడేళ్ళు పెద్దవాడు మరియు ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారు. ఈమె తండ్రి తన 32వ యేట మరణించేరు. అప్పటికి లతకి ఒక [[తమ్ముడు]]. ఆ తమ్మునిభారం తాను వహిస్తానని తండ్రికి మాట ఇచ్చేరామె ఆయన మరణసమయంలో.
1955లో [[విజయవాడ]]లోని [[ఆకాశవాణి|ఆకాశవాణి కేంద్రం]] నుండి అనౌన్సర్ గా ఈవిడ [[ఉద్యోగం]] చేయడం మొదలుపెట్టారు. మొదట్లో [[రేడియో నాటకాలు|రేడియో నాటకాల్లో]] పనిచేసి ఆపై సినిమాలలో[[సినిమా]]<nowiki/>లలో కూడా నటించి, [[మాటలు]] వ్రాయటం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియోనాటకం ''శిలాహృదయం'' (రాయి లాంటి మనస్సు). ఇది 1952 లో [[డెక్కన్ రేడియో]]లోరేడియోలో ప్రసారం చేసారు. ఈమె [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] అభిమాని, ఆయన [[సంగీతం]] కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేసారు.
భర్త ఆరోగ్యం క్షీణించడం ఒక పక్క, మరో పక్క ఇద్దరు పిల్లలు (మొదటి కొడుకు తెన్నేటి నారాయణరావు 1956 లో, రెండో కొడుకు తెన్నేటి మోహనవంశీ 1963 లో) [[సిజేరియన్ ఆపరేషన్]] ద్వారా పుట్టడంతో తీవ్రమయిన మానసిక క్షోభకు గురై, అదే విధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. [[జీవితం]]<nowiki/>లో మొదటి నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడానని ('''అంతరంగ చిత్రం''') లో ఆవిడ చెప్పుకున్నారు. 1997 లో 65 యేట ఆమె కన్ను మూసారు.
 
==సాహితీ వ్యాసంగం==
లత తన నవల ''[[గాలిపడగలు-నీటి బుడగలు]]''లో [[వేశ్య]] ల దుర్భర బ్రతుకు చిత్రించారు. వారు మగాళ్ళ వద్ద అనుభవించే హింస మరియు వారికి సంక్రమించే వ్యాధుల గురించి చర్చించారు.<ref>[http://englishthulika.wordpress.com/2008/04/11/tenneti-hemalata-an-invincible-force-in-telugu-literature/ తెన్నేటి హేమలత గురించిన ఒక వ్యాసం]</ref> ఎంత నిరసన వ్యక్తమయినా, ఆమె ఇదే విషయాన్ని తన ''రక్త పంకం'' అనే నవలలో మరింత లోతుగా విశ్లేషించారు.
[[మోహనవంశీ]] మరియు [[అంతరంగ చిత్రం]] అనే నవలలలో ఈమె జీవితానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుస్తాయి. 1980 లో ఈమె '''[[రామాయణ విషవృక్షఖండన|రామాయణ విషవృక్ష ఖండన]]''' అనే పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] [[రామాయణ విషవృక్షం|రామాయణవిషవృక్షానికి]] విమర్శ-గ్రంథంగా వ్రాసారు. [[రామాయణ విషవృక్షం]], కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షం|రామాయణ కల్పవృక్షానికి]] విమర్శ అని కొందరి వాదన. [[ప్రియతముడు]] అనే నవల [[హైదరాబాదు]] ఆరవ [[నిజాము]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్|మీర్ మహ్బూబ్ ఆలీ ఖాన్]] జీవితం ఆధారంగా వ్రాసారు.
లత ప్రకారం, ఆవిడ మాటల్లోనే, "నేను 105 [[నవల]] లు, 700 [[రేడియో నాటకం|రేడియో]] నాటకాలు]] , 100 [[కథ|చిన్నికథలు]] , పది [[రంగస్థలం|రంగస్థల నాటకాలు]] , 5 సంపుటాల [[సాహిత్యం|సాహిత్య వ్యాసాలు]] , రెండు సంపుటాల [[సాహిత్య విమర్శ|సాహిత్య విమర్శలు]] మరియు ఒక సంపుటి "లత వ్యాసాలు", ఇంకా 25 [[చరిత్ర]]<nowiki/>కందని ప్రేమకథలు అనే [[కవిత]]లు వ్రాసాను."
 
==పాక్షిక రచనాపట్టిక==
"https://te.wikipedia.org/wiki/తెన్నేటి_హేమలత" నుండి వెలికితీశారు