బోయినపల్లి వెంకట రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఇతను [[సెప్టెంబరు 2]], [[1920]] న [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>లోని బెజ్జంకి మండలం [[తోటపల్లి]] గ్రామంలో రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరారు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువునిలిపివేశారు. అయినా [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/telangana-gandhi-passes-away-145564.html తెలంగాణ గాంధీ ఇకలేరు]</ref>
==స్వాతంత్ర్య పోరాటయోధుడు==
చిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. [[ఆర్యసమాజ్]] ప్రభావంతో మతఛాందసవాదులతో పోరాడారు.<ref>శతవసంతాల కరీంనగర్ జిల్లా</ref> 1942లో [[క్విట్ ఇండియా ఉద్యమం]]<nowiki/>లో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 12 మాసాల కారాగారశిక్ష పొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశారు.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలుగు యోధులు</ref> అప్పటి ప్రధానమంత్రి [[ఇందిరాగాంధీ]] చేతులమీదుగా సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నారు. తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్నలలందుకున్న వెంకటరామారావు [[అక్టోబరు 27]], 2014న మరణించారు.<ref>నమస్తే తెలంగాణ ఆన్‌లైన్ వార్తాపత్రిక, తేది 27-10-2014</ref>
 
జిల్లాలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో బోవెరా పాత్ర కీలకం. ఆ సమయంలో జాతీయవాదులను 40మందిని సమీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేసి గిడ్డంగుల్లోని బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేశారు. ప్రతిగ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. నైజాం ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన 65సంవత్సరాల క్రితం [[దేవులపల్లి రామానుజరావు]] సాహితీ స్ఫూర్తితో కరీంనగర్‌లో సారస్వతజ్యోతి మిత్రమండలిని స్థాపించి రికార్డు స్థాయిలో [[సాహిత్యం|సాహిత్య]] కార్యక్రమాలు నిర్వహించారు. వినో బా బావే, జయప్రకాశ్‌ నారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, మల్లాది సుబ్బమ్మ వంటి ప్రముఖులతో పనిచేశారు. 1952లో[[1952]]లో ఎలగందుల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1957లో[[1957]]లో [[ఇందుర్తి]] నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ ఆప్‌ ఇండియా అభ్యర్థిగా పోటీచేశారు. దివంగత నేతచ్ కొండాలక్ష్మణ్ బాపూజీతో కలిసి నిరుడు తెలంగాణ కోసం ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]]<nowiki/>నుంచి తామ్ర పత్రాన్ని స్వీకరించారు. 2006లో [[కాకతీయ విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేట్‌నిచ్చి సత్కరించింది.
 
==మూలాలు==