నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39:
== జీవితం==
నండూరి రామ్మోహనరావు [[కృష్ణా జిల్లా]] [[బాపులపాడు]] మండలం [[ఆరుగొలను]] గ్రామంలో [[1927]], [[ఏప్రిల్ 24]] న జన్మించారు.1937-42 మధ్య [[నూజివీడు]], [[మచిలీపట్నం]] లలో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. [[రాజమండ్రి]] గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. [[రాజమండ్రి]] ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. [[1944]] [[ఏప్రిల్
ఆయన జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘ఆంధ్రజ్యోతి’లో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆయన 1962, 1978, 1984, 1992లలో [[అమెరికా]]లోను, 1982లో [[రష్యా]]లో పర్యటించారు.
|