ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి 49.207.236.161 (చర్చ) చేసిన మార్పులను 76.68.58.35 యొక్క చివరి కూర్పు వరకు తిప...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''[[ఉన్నవ లక్ష్మీనారాయణ]]''' ( [[డిసెంబరు 4]], [[1877]] - [[సెప్టెంబరు 25]], [[1958]]) (Unnava Lakshmi Narayana) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, [[తెలుగు]] నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ [[న్యాయవాది]]. ఆయన నవల '''[[మాలపల్లి]]''' తెలుగు సాహితీ చరిత్రలోనూ, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం.
 
==తొలి జీవితం==
ఉన్నవ లక్ష్మీనారాయణ [[గుంటూరు]] జిల్లా అప్పటి [[సత్తెనపల్లి]] తాలూకా [[వేములూరిపాడు|వేములూరుపాడు]] గ్రామంలో [[1877]] [[డిసెంబరు 4]]వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్య స్వగ్రామంలోనే సాగింది.1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో [[రాజమండ్రి]] ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో[[కళాశాల]]<nowiki/>లో [[శిక్షణ]] పొందాడు. 1916లో [[బర్లాండ్]], [[డబ్లిన్]] ‍లలో [[బారిష్టర్]] చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.
[[బొమ్మ:Unnava llakshmi narayana pantulu.jpg|thumb|left|250px|జైలు జీవితంలో లక్ష్మీ నారాయణ పంతులు గారు]]
 
పంక్తి 22:
 
==సాంఘిక సేవ==
ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో [[గుంటూరు]]లో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. [[1902]] లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు . [[వీరేశలింగం పంతులు]] అధ్యక్షతలో తొలి [[వితంతు వివాహం]] జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన [[వితంతువు|వితంతు]] శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, [[1912]] లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి [[విశాలాంధ్ర]] పటం తయారుచేశాడు. [[రాయవేలూరు]] జైలు నుంచి విడుదల అయిన తర్వాత [[1922]] లో [[గుంటూరు]]లో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.
 
==మాలపల్లి నవల==
[[బొమ్మ:Telugubookcover malapalli.JPG|right]]
 
[[రష్యా]]లో 1917లో జరిగిన బోల్షవిక్ [[విప్లవం]] వల్ల స్ఫూర్తి పొందిన మొదటి [[తెలుగు కవిత|తెలుగు కవి]] ఉన్నవ. కూలీల[[కూలీ]]<nowiki/>ల పక్షం వహించి [[కవులు]] రచనలు చేయడానికి ప్రేరణ నిచ్చింది [[రష్యా]] విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి, వారి పక్షం వహించి, వారి దుస్థితిని తెలియ జేసిన మొదటి వైతాళికుడు ఉన్నవ.
 
సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు, [[హరిజనులు]] అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు . అందుకు నిరూపణగా " [[మాలపల్లి (నవల)|మాలపల్లి]] అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత ' సంగ విజయం' అనే పేరు కూడా పెట్టాడు.
 
==మాలపల్లి నవల నిషేధం==
పంక్తి 35:
 
==మాలపల్లి నవల- చిత్రణ ==
రాజకీయ వాతావరణాన్ని, [[గాంధీ]] మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఈ సాంఘిక నవలలో [[సాంఘిక దురాచారాలు|సాంఘిక]] దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ , వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితులను కన్నులకు కట్టినట్లు ఉన్నవ చిత్రించాడు. ఆనాడు హరిజనుల [[కుటుంబము|కుటుంబ]] గాథను ఇతివృత్తంగా ఎన్నుకొని నవల వ్రాయడమే సాహసం. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక , సాంఘిక, కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేయిస్తాడు కాబట్టి ఈ నవలకు ' సంగవిజయం' అనే పేరు కూడా సార్థకమయింది. ఉన్నవ ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయ కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించాడు.
 
ఈ నవలకు పీఠిక వ్రాసిన [[కాశీనాథుని నాగేశ్వరరావు]] ఈ నవలను గూర్చి " ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ [[కావ్యం]] అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి" అని కొనియాడాడు. తెలుగు విప్లప సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం ' మాలపల్లి '. నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు తదితర రచనలు ఉన్నవ చేశాడు.
 
ఉన్నవ సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో, స్వాతంత్ర్య ఉద్యమాల్లో అతనికి చేదోడు-వాదోడుగా ఉంటూ అతని [[భార్య]] [[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]] సహధర్మచారిణిగా విశేష సేవలందజేశారు.
 
గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందిన ఉన్నవ [[1958]] సెప్టెంబరు 25 న తుది శ్వాస విడిచాడు.