ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 49.207.236.161 (చర్చ) చేసిన మార్పులను 76.68.58.35 యొక్క చివరి కూర్పు వరకు తిప... |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13:
}}
'''[[ఉన్నవ లక్ష్మీనారాయణ]]''' ( [[డిసెంబరు 4]], [[1877]] - [[సెప్టెంబరు 25]], [[1958]]) (Unnava Lakshmi Narayana) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, [[తెలుగు]] నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ [[న్యాయవాది]]. ఆయన నవల '''
==తొలి జీవితం==
ఉన్నవ లక్ష్మీనారాయణ [[గుంటూరు]] జిల్లా అప్పటి [[సత్తెనపల్లి]] తాలూకా [[వేములూరిపాడు|వేములూరుపాడు]] గ్రామంలో [[1877]] [[డిసెంబరు 4]]వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్య స్వగ్రామంలోనే సాగింది.1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో [[రాజమండ్రి]] ఉపాధ్యాయ శిక్షాణా
[[బొమ్మ:Unnava llakshmi narayana pantulu.jpg|thumb|left|250px|జైలు జీవితంలో లక్ష్మీ నారాయణ పంతులు గారు]]
పంక్తి 22:
==సాంఘిక సేవ==
ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో [[గుంటూరు]]లో యంగ్మెన్స్ లిటరరీ అసోసియేషన్ను స్థాపించాడు. [[1902]] లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు . [[వీరేశలింగం పంతులు]] అధ్యక్షతలో తొలి [[వితంతు వివాహం]] జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన [[వితంతువు|వితంతు]] శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, [[1912]] లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి [[విశాలాంధ్ర]] పటం తయారుచేశాడు.
==మాలపల్లి నవల==
[[బొమ్మ:Telugubookcover malapalli.JPG|right]]
[[రష్యా]]లో 1917లో జరిగిన బోల్షవిక్ [[విప్లవం]] వల్ల స్ఫూర్తి పొందిన మొదటి [[తెలుగు కవిత|తెలుగు కవి]] ఉన్నవ.
సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు,
==మాలపల్లి నవల నిషేధం==
పంక్తి 35:
==మాలపల్లి నవల- చిత్రణ ==
రాజకీయ వాతావరణాన్ని, [[గాంధీ]] మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఈ సాంఘిక నవలలో [[సాంఘిక దురాచారాలు|సాంఘిక]] దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ , వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితులను కన్నులకు కట్టినట్లు ఉన్నవ చిత్రించాడు. ఆనాడు హరిజనుల [[కుటుంబము|కుటుంబ]] గాథను ఇతివృత్తంగా ఎన్నుకొని నవల వ్రాయడమే సాహసం. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక , సాంఘిక, కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేయిస్తాడు కాబట్టి ఈ నవలకు ' సంగవిజయం' అనే పేరు కూడా సార్థకమయింది. ఉన్నవ ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయ కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించాడు.
ఈ నవలకు పీఠిక వ్రాసిన [[కాశీనాథుని నాగేశ్వరరావు]] ఈ నవలను గూర్చి " ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ [[కావ్యం]] అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి" అని కొనియాడాడు. తెలుగు విప్లప సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం ' మాలపల్లి '. నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు తదితర రచనలు ఉన్నవ చేశాడు.
ఉన్నవ సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో, స్వాతంత్ర్య ఉద్యమాల్లో అతనికి చేదోడు-వాదోడుగా ఉంటూ అతని [[భార్య]] [[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]] సహధర్మచారిణిగా విశేష సేవలందజేశారు.
గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందిన ఉన్నవ [[1958]] సెప్టెంబరు 25 న తుది శ్వాస విడిచాడు.
|