కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[కొడవటిగంటి కుటుంబరావు]]''' ([[అక్టోబర్ 28]], [[1909]] - [[ఆగష్టు 17]], [[1980]]), ప్రసిద్ధ తెలుగు రచయిత, [[హేతువాది]]. '''కొకు''' గా చిరపరిచుతుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. [[చందమామ పత్రిక]]ను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చెందినాడు.
 
== జీవితము ==
కొకు [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]] లోని ఒక మధ్య తరగతి [[బ్రాహ్మణ]] కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు [[1925]] వరకు సాగింది. చిన్నవయసులోనే [[1914]]లో తండ్రీ, [[1920]]లో తల్లీ మరణించడంతో [[మేనమామ]] వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేతవయసులోనే కొన్ని [[పద్యాలు]], ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. [[1925]]లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన [[పెళ్ళి]] జరిగింది.[[1925]] నుండి [[1927]] వరకు గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]]లో ఇంటర్మీడియేటు చదివాక, [[1927]]-29 కాలంలో [[మహారాజా కళాశాల]], విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన [[నాస్తికత్వం|నాస్తికుని]]గా మారిపోయాడు.
 
[[1929]]లో [[కాశీ]] [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|హిందూ విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. [[1930]]లో కొకు తొలిరచన ''సినిమా '' ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటికథ ''ప్రాణాధికం '' [[గృహలక్ష్మి మాసపత్రిక]]లో అగ్ర స్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. [[1931]]లో కొంతకాలం పాటు [[వరంగల్లు]]లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. [[చక్రపాణి]], పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు లతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి ''[[యువ]]'' పత్రికను ప్రారంభించాడు.
 
[[1939]]లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]]లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్‌శాస్త్రి]] (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. [[1942]] [[జూలై]] నుండి [[1943]] జనవరి వరకు సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]]లో [[ఒడిషా]] [[జయపూరు]]లోజయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
 
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగిన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]]లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]]లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] [[ఎయిర్ ఇండియా]] కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]]లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]]లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]], [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]]లో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి సలిపాడు.