కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు]]''' ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు బహు గ్రంథ రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1937]], [[నవంబరు 7]]న [[కృష్ణాజిల్లా]] [[కైకలూరు]] గ్రామంలో అన్నపూర్ణ, వెంకట అప్పారావు దంపతులకు జన్మించాడు. ఇతడు [[మచిలీపట్నం]] హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]], [[మాధ్యమిక విద్య|మాధ్యమిక]] విద్యలను చదివాడు. [[గుడివాడ]] ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్ల సాహిత్యం అభిమాన విషయంగా బి.ఎ. చదివాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి 1962లో [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ఎం.ఎ., అగస్త్య పండితుని [[బాలభారతము]] అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పి.హెచ్.డి చేశాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[అమలాపురం]]లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగాడు. ఇతడు సంస్కృత, [[తెలుగు]], ఆంగ్ల భాషలలో రచనలు చేశాడు. [[హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషలనుండి పలు గ్రంథాలను తెలుగులోనికి[[తెలుగు]]<nowiki/>లోనికి [[తర్జుమా]] చేశాడు. ఇతడు [[అష్టావధానం]], నేత్రావధానం మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశాడు. ఇతడు మంచి [[చిత్రకారుడు]] కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఇతనికి పేరును తెచ్చిపెట్టాయి. ఇతడు అనేక సెమినార్లలో [[తెలుగు]], సంస్కృతాలలో పత్రసమర్పణ చేశాడు. [[ఆకాశవాణి]]లో సంస్కృతాంధ్రభాషలలో [[కవిత్వం]], [[దేశభక్తి గేయాలు]], నాటికలు ప్రసారం చేశాడు. ఇతడు పలు స్టేజి, [[రేడియో]] నాటకాలలో నటించాడు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశాడు<ref>{{cite news|last1=హెబ్బార్|first1=నాగేశ్వరరావు|title=ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘ఘనశ్యామల’|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-384|accessdate=3 February 2017|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=31 December 2016}}</ref>.
 
==అవధానాలు==
ఇతడు మొదటి [[అవధానము|అవధానం]] 1974లో చేశాడు<ref name=కొత్తపల్లి>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=422-427|edition=ప్రథమ|accessdate=3 February 2017}}</ref>. పిమ్మట ఇతడు [[మచిలీపట్టణం]], [[గుడివాడ]], [[కైకలూరు]], [[కాకినాడ]], [[రాజమండ్రి]] మొదలైన చోట్ల [[అష్టావధానాలు]] విజయవంతంగా[[విజయవంతం]]<nowiki/>గా నిర్వహించాడు. ఇతని అవధానాలలో దత్తపది, [[సమస్యాపూరణం|సమస్య]], వర్ణన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగము, కావ్యపఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలు ఉన్నాయి.
===అవధానాలలో కొన్ని పూరణలు===
* సమస్య: మునికిన్ కోపము భూషణంబగు జనామోదంబు సంధిల్లగన్