కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''[[కొమ్మూరి వేణుగోపాలరావు]]''' ([[సెప్టెంబరు 4]], [[1935]] - [[అక్టోబరు 31]], [[2004]]) ప్రసిద్ధిచెందిన తెలుగు [[రచయిత]]. ఇతడు [[పెంకుటిల్లు]] నవలా రచయితగా ప్రసిద్ధుడు. ఇతడు [[బెంగాలు]] రచయిత [[శరత్ చంద్ర]] ప్రభావానికి గురై [[తెలుగు]]లో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్"గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా [[నవల]]లు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో ''హౌస్ సర్జన్'', ''[[హారతి]]'', ''వ్యక్తిత్వం లేని మనిషి'' నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి [[ప్రేమ నక్షత్రం]] నవల సినిమాగా వచ్చింది. 1959 లో ''గోరింటాకు'' సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన [[ఆకాశవాణి]] కోసం ఎన్నో [[నాటిక]]లు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి [[కథలు]] కూడా రచించాడు. వాటిలో ''మర మనిషి'' కథను [[నేషనల్ బుక్ ట్రస్ట్]] అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.
 
తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]], [[గొల్లపూడి మారుతీరావు]] గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "[[ఇడియట్]]" అనే పేరుతో [[ఆంధ్ర జ్యోతి]] వారపత్రికలో [[1968]] లో ధారావాహికగా ప్రచురించారు.