హరిశ్చంద్ర (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , స్మశానా → శ్మశానా, పని చేసి → పనిచేసి using AWB |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 58:
==కథాంశం==
హరిశ్చంద్రుడు (ఎస్వీ రంగారావు) తన రాజ్యంలో ప్రజలకు న్యాయం చేకూరుస్తూ సపరిపాలన చేస్తూ వుంటాడు. ఇంద్రలోకంలో వశిష్ట మహామునిని ఇంద్రుడు (కె.రఘురామయ్య) భూలోకంలో సత్యపాలకుడు ఎవరైనా వున్నారా అని అడగగా మునివర్యుడు హరిశ్చంద్రుడు అని జవాబు చెప్పుతాడు. దానికి విశ్వామిత్రుడు (గుమ్మడి) మండిపడుతూ హరిశ్చంద్రుడిని సత్యభ్రష్టుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకని ముందు అయోధ్య రాజ్యంలో తన తపశ్శక్తితో మృగ సంచారం పెంచుతాడు. ఈ విషయం ప్రజలు హరిశ్చంద్రుని చెవిన వేస్తారు. అందుకని హరిశ్చంద్రుడు రాణి చంద్రమతి (లక్ష్మీరాజ్యం), యువరాజు లోహితుడు మరియు మహామంత్రితో సహా వేటకు వెళ్ళతాడు. విశ్వామిత్రుడు తన శక్తితో ఇద్దరు మాతంగకన్యల (రాజసులోచన, కుచలకుమారి)ను సృష్టించి హరిశ్చంద్రుడిని ధర్మమార్గం నుండి మళ్లించుటకు తన శిష్యుడు నక్షత్రకుడిని (రేలంగిని) వారికి తోడుగా పంపిస్తాడు. కానీ వారు పరాభావం పొందుతారు. ఇది తెలిసిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మాతంగ కన్యలను వివాహమాడమని ఆజ్ఞాపిస్తాడు. కానీ హరిశ్చంద్రుడు తాను ధర్మమార్గం నుండి తప్పనని చెప్పుతాడు, ఇంకేదైనా విషయం అడగమని చెప్పగా అతనిని తన రాజ్యానిని దానం చేయమని అంటాడు, ఇంతకు ముందు విశ్వామిత్రునికి ఇవ్వవలసిన యాగధనం అడగగా అతని దగ్గర ఏమీ లేక పోవటంతో ఎదైనా పనిచేసి ఋణాన్ని తీర్చడానికి సిద్ధమవుతాడు. వారి వెంట తన శిష్యుడు నక్షత్రకుడిని పంపిస్తాడు విశ్వామిత్రుడు. అలా వారు కాశీకి చేరుకుని కాశీనాథుడిని దర్శించుకుంటారు. తర్వాత విశ్వామిత్రుని ఋణాన్ని ఎలా తీర్చాలని ఆలోచిస్తుండగా చంద్రమతి తనను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఋణాన్ని తీర్చమంటుంది. దానికి హరిశ్చంద్రుడు ముందు అంగీకరించడు, కానీ అంగీకరించవలసి వస్తుంది. చంద్రమతిని అమ్మడానికి తీసుకెళ్ళగా ఒక బ్రాహ్మణుడు అయిన కాలకౌశికుడు (గౌరీపతిశాస్త్రి) ఆమెతో పాటు వారి పుత్రుడిని కూడా ఇవ్వమని పట్టుబడుతాడు, వారు తప్పక అలానే చేయవలసి వస్తుంది. ఆ బ్రాహ్మణుని భార్య అయిన కలహకంఠి (సూర్యకాంతం) పరమ గయ్యాళి చంద్రమతి మరియు ఆమె కొడుకుని ఏంతో బాధ పెడుతుంది. మరో వైపు నక్షత్రకుడు అడగగా హరిశ్చంద్రుడు తనను కూడా అమ్మేసి డబ్బుని అతనికి తమతోపాటుగా వచ్చినందుకు ఇస్తానంటాడు. అలా హరిశ్చంద్రుణ్ణి ఒక కాటికాపరి అయిన వీరబాహు (ఎ.వి.సుబ్బారావు)కి అమ్మేస్తాడు. ఒకసారి చంద్రమతి తన కొడుకుని కొందరితో చిన్న పనికి పంపిస్తుంది, దారిలో అతన్ని పాము కాటువేయగా మరణిస్తాడు. అలా కాటు వేయమని విశ్వామిత్రుడు చెప్పుతాడు. చంద్రమతి తన కొడుకు మృతదేహాన్ని దహనం చేయటానికి శ్మశానానికి తీసుకువెళ్తుంది. అక్కడ కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు ముందు వారిని గుర్తించడు, గుర్తించిన తరువాత బాధతో కుంగిపోతాడు. ఉద్యోగధర్మం గుర్తుకు వచ్చి శిస్తు చెల్లించనిదే దహన సంస్కారాలను జరుపవలదని చెప్పుతాడు. చంద్రమతి ఇంటికి వెళ్ళి ఏదైనా తేవటానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఒక రాక్షసుడు విశ్వామిత్రుని ఆదేశంపై కాశీ రాజకుమారుడిని హత్యచేసి ఆ నిందను చంద్రమతిపై పడేటట్టు చూస్తాడు. చంద్రమతికి కాశీరాజు మరణదండన విధిస్తాడు. వీరబాహు హరిశ్చంద్రుణ్ణి ఆ శిక్ష అమలు చేయమని పంపిస్తాడు. శిక్ష వేయాల్సింది తన భార్యకేనని తెలిసి బాధపడతాడు. చివరికి శిక్ష వేయటానికి కత్తి పైకి ఎత్తుతాడు. ఆపు విశ్వామిత్రుదు ప్రత్యక్షమై అతను స్త్రీ హత్యకు పాల్పడబోతున్నాడని హెచ్చరిస్తాడు. అయినా అతని మాట వినకుండా తల నరకడానికి సిద్ధమవుతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా కత్తితో చంద్రమతి మెడ మీద దెబ్బ వేస్తాడు, అది పూలదండగా చంద్రమతి మెడలో పడుతుంది. దేవతలందరు ప్రత్యక్షమై హరిశ్చంద్రుణ్ణి దీవించి, కాశీ రాజకుమారుడిని, లోహితుడిని బ్రతికిస్తారు. [[హరిశ్చంద్రుడు]] తిరిగి అయోధ్య రాజ్యాన్ని జనరంజకంగా పాలిస్తాడు.
==పాటలు==
|