అశ్వినీ దేవతలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[అశ్వినీ దేవతలు]]''' పురాణ పురుషులు మరియు [[కవల]]లు. వీరు [[సూర్యుడు|సూర్యుని]]కి, [[ఛాయాదేవి]]కి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. [[మహాభారతం]]లో పాండురాజు పత్ని [[మాద్రి]]కి మంత్ర ప్రభావము వలన [[నకులుడు]] మరియు [[సహదేవుడు]] జన్మించారు. వీరు [[ఆయుర్వేదము|ఆయుర్వేదాన్ని]] [[దక్ష ప్రజాపతి]] నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.
== పురాణ కథనం ==
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు వీరు [[కవలలు]]. వీరిసోదరి [[ఉష]]. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు [[హిరణ్యవర్తం]]. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది [[హిరణ్యం]]తో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి. చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆరథంలో ఓకవైపు [[ధన రాశులు|ధనం]] మరొకవైపు [[తేనె]], [[సోమరసం]] మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరి చేతిలో [[తేనె]], [[సోమరసం]] మరియు [[మంచు]]<nowiki/>తో అద్దిన బెత్తంతో [[యజ్ఞం]] చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు. వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరి ఆయుధాలలో[[ఆయుధాలు|ఆయుధాల]]<nowiki/>లో అత్యంత ప్రభావితమైన మహా [[ఔషధాలు]] ఉంటాయి. వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.
 
== హవిర్భాగం పొందుట ==
అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. వృద్దుడైన [[చ్యవన]]మహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన [[సుకన్య]] భార్యగా[[భార్య]]<nowiki/>గా లభించింది. సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోషపెట్టడానికి [[యవ్వనం]] కావాలని అనిపించింది. అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు. బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు.
== ఋగ్వేదం ==
అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి. కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను. [[మిథునరాశి|మిథున]] రాసి లోని కేస్టర్‌, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి. అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహమునకు, అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా, ఓడలతో వ్యాపారము జేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండునత్లు [[ఋగ్వేదము]]<nowiki/>న ఈ క్రింద దృష్టాంతరమున కన బడుచున్నది. వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.
# శయుడను ఋషియొక్క గోవుఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినత్లు సాయపడిరి.
# రేభుడు, నందనడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి.
పంక్తి 26:
ఈ అశ్వనిలు మొదట [[కంచర గాడిద]]<nowiki/>లపై ఎక్కి తిరుగుచుండిరట. తరువాత ఋభువు లను [[వడ్రంగులు]] వీరికొక రథమును చెక్కి బహూకరింపగా, దానిపై కూర్చొండి తిరుగుచుండిరి. ఈ రథమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, [[మొసళ్ళు]], కట్టినట్లు కొన్ని ఋక్కులలో ఉంది. [[సముద్రము]]<nowiki/>పై ప్రయాణముచేసి తర్వాత రథమెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో ఉంది. అందువలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి.
 
ఋగ్వేదము 1 వ మండలములోని[[మండలము]]<nowiki/>లోని 16వ అనువాకము 112 మొదలు 117 వరకు గల సూక్తములు పై విషయములను తెలుపుచున్నవి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అశ్వినీ_దేవతలు" నుండి వెలికితీశారు