కోడి రామ్మూర్తి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →మూలాలు: {{commons category|Kodi Rammurthy Naidu}} |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''[[కోడి రామ్మూర్తి నాయుడు]]''' (1882 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన [[తెలుగు]]వారిలో అగ్రగణ్యులు. [[శ్రీకాకుళం]] జిల్లా [[వీరఘట్టం]]లో జన్మించారు. '''కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు వీడియోను చూడండి.'''
==బాల్యము==
పంక్తి 42:
==సర్కస్ కంపెనీ==
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. [[తెలుగు]] జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో [[చెన్నై|మద్రాసు]] చేరాడు. [[పులులు]], [[ఏనుగులు]], [[గుర్రాలు]], [[చైనా]], [[జపాన్]] కళాకారుల సహకారం ఆయనకు లభించాయి.
రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. ఛాతి ప<nowiki/>ై పెద్ద
==ప్రముఖులు ఇచ్చిన బిరుదులు==
*
* హైదరాబాద్ లో [[ఆంధ్రభాషా నిలయం]] పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు.
* అప్పటి వైస్రాయి [[లార్డ్ మింటో]], రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన
*
==విదేశాలలో ప్రదర్శన==
సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. రామమూర్తిగారు 1600 మంది గల తన బృందంతో [[లండన్]] వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు [[ఇమామ్ బక్షీ]] ఆ బృందంలో వుండేవాడు.
[[లండన్]] లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత '[[ఇండియన్ హెర్కులస్]]' బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు [[ఫ్రాన్స్]], [[జర్మనీ]], [[స్పెయిన్]] దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.
[[స్పెయిన్]] దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ' సరే ' అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.
[[జపాన్]], [[చైనా]], [[బర్మా]]<nowiki/>లలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో
[[బర్మా]]లో వున్నపుడు [[రంగూన్]]లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.
[[భారతదేశం]] అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్ళాలనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి.
రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో వున్నారు.
పంక్తి 69:
భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.
కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. [[శస్త్ర చికిత్స]] జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.
చివరిరోజులు బలంఘర్, [[పాట్నా]]<nowiki/>లో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు.
|