గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[గోన బుద్ధారెడ్డి]]''' సుప్రసిద్ధ [[తెలుగు]] కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను [[కాకతీయులు|కాకతీయుల]] సామంతరాజుగా పనిచేశాడు. [[కందూరు]] రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర [[రంగనాథ రామాయణము]] గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీ.శ.1294-1300 కాలంలో<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్ ఎస్వీ రామారావు, పేజీ 28</ref> రచించబడింది. [[యుద్ధకాండ]] వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని [[కుమారులు]] పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.<ref>కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168</ref> ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు<ref name="సింహావలోకనము" />. గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి [[రామాయణము|రామాయణ]] కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు [[తిక్కన]] రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని [[సంపూర్ణ రామాయణం]] కాదు<ref>పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 8</ref>
 
== కుటుంబ నేపథ్యం ==
[[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోనివారు గోన గన్నారెడ్డి]] వంశస్థులు. బుద్ధారెడ్డి రచించిన [[రంగనాథ రామాయణము|రంగనాథ రామాయణం]] అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. బుద్ధారెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి [[ముత్తాత]] పేరు గోన రుద్రభూపతి. రుద్రభూపతి [[తండ్రి]] గోన కాటరెడ్డి.
 
== జీవిత విశేషాలు ==
[[కాకతీయులు|కాకతీయ]] రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్థమానపురం (నేటి వడ్డెమాన్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోన బుద్ధారెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గోన గన్నారెడ్డి వర్థమానపురం రాజధానిగా పాలించాడు.<ref>తెలంగాణ చరిత్ర, సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచన, 2011, పేజీ 129</ref> ఇతని తర్వాత గోన బుద్దారెడ్డి అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోన బుద్ధారెడ్డి కూతురు [[కుప్పాంబిక]] గుండేశ్వరాలయం నిర్మించింది<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>. ఈమె తొలి [[తెలుగు]] కవియిత్రిగా ఖ్యాతి చెందింది.
 
== సాహిత్యం ==
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ [[రామాయణము|రామాయణం]] తెలుగులో తొలి [[సంపూర్ణ రామాయణం]]గా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన [[నిర్వచనోత్తర రామాయణం]] సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని [[ద్విపద]] ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును[[ఛందస్సు]]<nowiki/>ను ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాథు]]<nowiki/>ని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు.
మరియు చాల తెలివి గల వ్యక్తి .
 
పంక్తి 17:
# [[పోతన]] [[శ్రీమదాంధ్ర భాగవతం|భాగవతం]]
 
గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు [[రాజధాని]] అయిన [[గండికోట]]<nowiki/>కు అతిచేరువలోని పెద్దపసుపల లేదా n కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ [[జమ్మలమడుగు]]లో నివసించుచున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు