స్వయంవరం (1982 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 18:
== కథ ==
ధర్మారావు బావమరిది సుబ్బారావు ఒక అగ్ని ప్రమాదంలో భార్యతో పాటు సర్వస్వాన్ని కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న సుబ్బారావును ధర్మారావు తన భార్య నగలమ్మి తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటాడు. ధర్మారావు కొడుకు శేఖర్,
వీళ్ళ సంస్థలో పనిచేసే గుమాస్తా దురాశా పరుడు. లంచాలకు ఆశపడి వ్యాపారానికి చేటు తెస్తుంటే ధర్మారావు ఒకసారి అతన్ని తీవ్రంగా మందలిస్తాడు. ఆ గుమాస్తా భర్తను కోల్పోయిన తన చెల్లెలి ప్రేమను ఎరగా వేసి
అదే సమయానికి ధర్మారావు గుండెపోటుతో మరణిస్తాడు. కర్మకాండలు జరిపించిన వెంటనే ప్రియ ఇంటికి వెళ్ళిన శేఖర్ నౌకరు ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధ పడతాడు. ప్రియ భర్త రాజశేఖరం విలాస ప్రియుడు. మొదటి రాత్రికి కూడా ఇంటికి రాడు. తనకున్న అలవాట్ల గురించి, సంబంధాల గురించి బాహాటంగా ప్రియతో చెప్పి ఆమెకు కూడా ఇష్టమైతేనే కాపురం చేయమంటాడు. తల్లి బలవంతం మీదనే పెళ్ళి చేసుకున్నాననీ చెబుతాడు. ప్రియకు మాత్రం ఇంకా శేఖర్ కళ్ళలోనే మెదలుతుంటాడు. ప్రియ ఇంట్లో పనిచేసే టీచర్ రమాదేవి సాయంతో శేఖర్ ప్రియను కలిసి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ ప్రియ ఇంకా అతని పట్ల ద్వేషంతోనే ఉంటుంది. రమాదేవి శేఖర్ నుంచి నిజం తెలుసుకుని ప్రియకు చేరవేస్తుంది. రమాదేవి ఎలాగైనా వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునేలా చేయాలని ప్రయత్నిస్తుంటుంది కానీ కుదరదు. ఇదంతా తెలుసుకున్న రాజశేఖరమే ఇద్దరు కలుసుకునేలా చేస్తాడు. వాళ్ళిద్దరూ విడిపోవడానికి అందరూ ఎలా కారణమయ్యారో వివరించి ఇద్దర్నీ పెళ్ళి చేసుకోమంటాడు. కానీ సాంప్రదాయానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడదు. చివరకు రాజశేఖరం ఆత్మహత్య చేసుకుని చివరి కోరికగా శేఖర్, ప్రియలను పెళ్ళి చేసుకోమని కోరడంతో కథ ముగుస్తుంది.
|