కొండపల్లి రాజా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== కథ ==
రాజా తన తల్లితో పాటు ఆవులను పెంచుకుంటూ పాలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రాజా, ధనవంతుడు గంగాధరం కొడుకైన అశోక్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అశోక్ చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం వల్ల రాజా తల్లినే తన తల్లిలాగా అభిమానిస్తుంటాడు. అశోక్ తన కంపెనీలో పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ గంగాధరానికి అది ఇష్టం ఉండదు. రాజానే వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాడు. రాజా కూడా లక్ష్మి అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. గంగాధరం రాజా మీద ద్వేషం పెంచుకుంటాడు. ఎలాగైనా తన కొడుకుని రాజా నుంచి దూరం చేయాలని పథకం వేస్తాడు. గంగాధరం చేసిన మోసం వల్ల రాజా తన తల్లి ప్రాణంగా చూసుకున్న ఇల్లు పోగొట్టుకుంటాడు. జరిగిన దాంట్లో అశోక్ పాత్ర కూడా ఉందని రాజా వాళ్ళింటికి వెళ్ళి అతని మీదే చాలెంజ్ చేస్తాడు. ప్రాణస్నేహితులిద్దరూ విడిపోతారు. అంతకు మునుపు ఒకసారి రాజా ప్రవర్తనకు అభిమానియైన మంత్రి సింహాద్రి అప్పన్న సహాయంతో బ్యాంకు లోను తీసుకుని డైరీ వ్యాపారం ప్రారంభించి మళ్ళీ కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో అశోక్ ని ఓడించి అధ్యక్ష పదవి సంపాదిస్తాడు.
 
రాజా చెల్లెలు అశోక్ తమ్ముడు శ్రీకాంత్ తో ప్రేమలో పడుతుంది. కానీ రాజా మాత్రం అశోక్ తో మాట్లాడటానికి ఇష్టపడడు. కానీ శ్రీకాంత్ తన పట్టు విడవకుండా తన ప్రేమ నిరూపించి రాజాని ఒప్పిస్తాడు. రాజా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. పెళ్ళైనా తర్వాత శ్రీకాంత్ తన నిజస్వరూపం బయటపెడతాడు. రాజా చెల్లెల్ని అన్ని రకాలుగా వేధిస్తుంటాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి_రాజా" నుండి వెలికితీశారు