నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
ఈవిధంగా ఇక్కడ 200 సం.లు, మధ్యప్రదేశంలో 12 సం.లు, ఉత్తరాపధం. కింపురుష 200 సం.లు, పూర్వదేశంలో 100 సం. శ్రీగిరిలో 129 లేక 71 సం.లు జీవించినాడు అని టిబెట్టు గ్రంధములు తెలుపు చున్నవి.
 
శ్రీ.ఎస్.సి దాస్ అనే శాస్త్రవేత్త టిబెట్టు నుండి పలు గ్రంధములను సేకరించి అచ్చు వేయించినాడు.అందులో <nowiki>'DpagBsam' అనే గ్రంధము ఒకటి కలదు. ఇందులో నాగార్జుని జన్మస్థలము గురించి కొన్ని విషయములున్నవి. నాగార్జునుడు దక్షిణాపధంలొ ఉన్న '''కహోర'''</nowiki> అనేచోట జన్మించాడు. ఇది కంచిదగ్గర ఉన్నది. ఇతని కుటుంబం ఇక్కడి నుండి వెళ్ళి విదర్భలో ఉంటూ ఉండవచ్చు.ఇతని ముఖ్య శిష్యులలో ఒకడు నాగహవుడు ఒకడు. ఇతనే తధాగతభద్రుడు. ఇతను తన గురువువలే నలేంద్రలో ఆచార్య పదవిలో ఉన్నాడు. నాగార్జునుడు ఆంధ్ర సింహళములోని ధాన్యకటక, శ్రీగిరిమఠములలో పెక్కు ఏండ్లుండి పని చేశాడు.
 
టిబెట్టు వారి భూగోళ శాస్త్రంలో ధాన్యకటకమనగా కృష్ణడెల్టా లో ఉన్నదని, దానిని ధనశ్రీలంక అని కూడా అంటారని ఉంది.
 
నాగ+అర్జునుడు అనగా నాగులకు [[అర్జుని]]<nowiki/>ని వంటి వాడని నాగులకు దీపకుడంటివాడు. ఈనాగులెవరు? తక్షుడు నాగరాజు కనుక తక్షశిల దేశం నాగదేశమం అని అందురు.కాని బౌద్ధకధలలో ఆంధ్రదేశము నాగదేశంగా చెప్పబడినది. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] చైత్యపురాళ్ళలో నాగుల [[విగ్రహాలు]] అనేకం ఉన్నవి. మనలో నాగులపేర్లు కనుక నాగార్జుని నాటికి మన ఆంధ్రదేశంగానే భావించవచ్చును.
 
నాగార్జునుడు విద్యను నేర్చుకొనుటకు ఎంత శ్రమించాడో, ప్రచారం చెయుటకూ అంతే శ్రమించాడు. సువర్ణ విద్యను ఒక సారా అమ్మే మామూలు స్త్రీ వద్ద నేర్చుకొన్నాడు. తంత్ర విద్యలకు దక్షిణాపధం నుండి [[తక్షశిల]] వరకూ తిరిగాడు. ఇందులో ఇతనికి స్వార్ధం లేదు. నిస్సంగి, ఇన్ని విద్యలు తెలిసినవారు ఉండరేమో కదా! అనేక గ్రంధములకు వ్యాఖ్య రచించాడు. ఘూష అనగా సింహం గర్జించినట్లు చెప్పుట. మూడుసార్లు ధర్మఘోష చేశాడు. [[సింహం]] ఎట్లా నిస్సంకోచంగా గర్జిస్తుందో అట్లా ధర్మఘోష చేయమని బుద్ధ భగవానుడు చెప్పాడు.
 
== మాధ్యమిక వాదం ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు