జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|organizations= భారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ
}}
జె.పి.గా సుప్రసిద్దులైన '''[[జయప్రకాశ్ నారాయణ్]]''' (జననం:[[అక్టోబరు 11]], [[1902]] — మరణం:[[అక్టోబరు 8]], [[1979]]) భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు. [[1970]] వ దశకంలో అప్పటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]]కి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు ''[[లోక్ నాయక్]]'' అని సగౌరవంగా పిలుచుకుంటారు.[[భారత ప్రభుత్వం]] ఈయన 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది
 
== ప్రారంభ జీవితం ==
జయప్రకాశ్ నారాయణ్ [[ఉత్తర ప్రదేశ్]] లోని [[బలియా]] జిల్లాకు, [[బీహారు]] లోని [[సారన్]] జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను [[పాట్నా]]లో అభ్యసించాడు. అటుపిమ్మట [[అమెరికా]]లో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి [[1929]]లో [[భారతదేశం]] తిరిగి వచ్చాడు. అమెరికాలో ఉన్న సమయంలో [[మార్క్స్]] సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే [[యం.యన్.రాయ్]] రచనల ప్రభావానికి లోనయ్యాడు.
 
[[1920]]లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, [[కస్తూరిబా గాంధీ]] అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహమాడాడు.
[[File:J P Narayan.JPG|thumb|left|ఇజ్రాయేల్ ప్రధాని డేవిడ్ భెన్ ఘురియన్ తో నారాయణ్]]
== స్వాతంత్ర్య సమరయోధుడిగా ==
అమెరికానుండి వచ్చిన వెంటనే [[జవహర్‌లాల్ నెహ్రూ]] ఆహ్వానం మేరకు [[ఇండియన్ నేషనల్ కాంగ్రెసు]]లో చేరి త్వరలోనే [[మహాత్మా గాంధీ]]కి ప్రియ శిష్యుడుగా[[శిష్యుడు]]<nowiki/>గా మారాడు.
 
[[1932]]లో [[శాసనోల్లంఘనోద్యమం]]లో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. విడుదలైన తరువాత కాంగ్రెసులో[[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెసు]]<nowiki/>లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన [[కాంగ్రెసు సోషలిష్టు పార్టీ]]కి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు.
 
[[1942]]లో [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమ]] కాలంలో సీనియర్ కాంగ్రెసు నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ [[రాం మనోహర్ లోహియా]], బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు.
పంక్తి 34:
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]]ని దోషిగా పేర్కొంటూ [[అలహాబాదు]] హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే [[ఇందిరాగాంధీ]] జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినది. ఆఖరికి [[కాంగ్రెసు పార్టీ]] లోనే ''[[యంగ్ టర్క్‌]]''లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.
జె.పి. [[ఛండీఘడ్]]లోఛండీఘడ్లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. [[బీహారు]] వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.
చివరికి ఇందిరా గాంధీ [[జనవరి 18]], [[1977]]న [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]]ని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి [[కాంగ్రెసు]]కు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో [[జనతా పార్టీ]] రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెసును ఓడించి, ఇందిరను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది.
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు