నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
[[బొమ్మ:NSP.JPG|thumb|300px|right|నాగార్జునసాగర్ ఆనకట్ట]]
[[బొమ్మ:Nagarjunasagar Reservoir AerialView.JPG|thumb|300px|right|ఆనకట్ట వలన ఏర్పడిన జలాశయం (విమానంనుండి తీసిన చిత్రం)]]
[[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]] లోని [[గుంటూరు]] జిల్లా, [[నల్గొండ]] జిల్లాల మధ్య [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''[[నాగార్జున సాగర్]]''' (Nagarjuna Sagar) అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు పొడవులో[[పొడవు]]<nowiki/>లో మొదటిది.దీని నిర్మాణ కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 490 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల [[వెడల్పు]] కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. ఈ సాగర్ ద్వారా [[నల్గొండ]], [[ఖమ్మం]], [[కృష్ణా జిల్లా|కృష్ణ]], మరియు [[గుంటూరు]] జిల్లాలకు [[సాగునీరు]] అందించు చున్నది. అంతేగాక ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.
 
==ప్రాజెక్టు-పట్టణం ==
పంక్తి 51:
[[కృష్ణా నది]]పై నిర్మించబడ్డ ఆనకట్టల్లో '''నాగార్జునసాగర్ ప్రాజెక్టు''' (Nagarjuna Sagar project) అతి పెద్దది. ఇది ఒక ''బహుళార్థసాధక ప్రాజెక్టు''. [[తెలంగాణ]]లో [[నల్గొండ]] జిల్లా [[నందికొండ]] వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో ''నందికొండ ప్రాజెక్టు'' అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు '''నాగార్జునసాగర్ ప్రాజెక్టు''' అని పేరుపెట్టారు.
 
[[నందికొండ]] గ్రామం [[నల్గొండ]] జిల్లా [[పెద్దవూర]] మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ [[పట్టణము]] మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి. <!-- ప్రస్తుతం ఉగ్ర వాదుల వలన భద్రతా వలయంలో చిక్కుకుంది. (ఆధారం చూపనందున ఈ వాక్యం అదృశ్య రూపంలో ఉంచబడింది)-->
 
నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే ''నాగార్హున కొండ''. [[ఆచార్య నాగార్జునుడు]] ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిథిలాలను [[జలాశయం]] మధ్యలో "నాగార్జున కొండ" అని ఇప్పుడు పిలువబడే [[మ్యూజియం]]లో భద్ర పరచారు. ఆ మ్యూజియాన్ని [[నాగార్జునకొండ మ్యూజియం]] అంటారు.
పంక్తి 58:
 
===చరిత్ర===
ఇక్కడ ఒక [[జలాశయము]] కట్టాలనే ఆలోచన [[బ్రిటిష్]] పరిపాలకుల కాలంలోను అనగా [[నైజాం|నైజాము]] పరిపాలన కాలములోనే [[1903]] లోనే వచ్చింది. చివరికి భారత దేశ ప్రథమ ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ|శ్రీ జవహర్ లాల్ నెహ్రూ]] చేతుల మీదుగా [[1955]] [[డిసెంబరు 10]] నాడు పునాది రాయి పడింది. భారత దేశ రెండవ ప్రధాని [[ఇందిరా గాంధీ|శ్రీమతి ఇందిరాగాంధి]] చేతుల మీదుగా [[1967]] లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.
 
గతంలో ఈ ప్రాంతాన్ని [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకులు]], [[శాతవాహనులు]] పరిపాలించేవారు. ఆకాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయములో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి పరిరక్షణకు వాటిలో చాల వాటిని యదాతదంగా పెకలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జున కొండపైకి తరలించి అక్కడ వాటిని యదాతదంగా ఏర్పాటు చేయడము జరిగింది. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదర్శన కొరకు పెట్టారు.
 
ఉమ్మడి [[మద్రాసు]] రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్"ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి [[ముక్త్యాల రాజా]] అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. [[కె. ఎల్. రావు]] ద్వారా పూర్వం [[హైదరాబాదు]] నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై [[మాచెర్ల]] దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.
[[దస్త్రం:Fundation.jpg|thumb|300px|right|నాటిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్ధాపన చేసారు]]
[[ఫైలు:Nagarjunasagar foundation stone.JPG|thumb|200px|శంకుస్థాపన ఫలకం.]]
 
[[చెన్నై|మద్రాసు]] ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము [[ఖోస్లా కమిటీ]] ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో [[నందికొండ]] ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. [[1952]]లో ఖోస్లా కమిటీ [[నందికొండ]] డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. [[విజయవాడ]] నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.
 
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు [[ఢిల్లీ]]లో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ [[ఎన్.జి.రంగా]], [[మోటూరు హనుమంతరావు]], [[కొత్త రఘురామయ్య]] మొదలగు [[భారత పార్లమెంటు|పార్లమెంటు]] సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను [[1952]]లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. [[1955]] [[డిసెంబర్ 10]]న ([[మన్మధ]] నామ సంవత్సరం [[కార్తీక బహుళ ద్వాదశి]] నాడు) అప్పటి [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రాజెక్టు నిర్మాణానికి [[శంకుస్థాపన]] చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర [[ముఖ్యమంత్రి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర]] [[గవర్నర్]] [[సి.ఎం.త్రివేది]] ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం [[1969]]లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని [[1974]]లో పూర్తయింది.
 
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ [[ముక్త్యాల రాజా]] కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. [[నార్ల వెంకటేశ్వర రావు]] మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.
 
[[బౌద్ధమతం|బౌద్ధ]] అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన [[నందికొండ]], ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.
 
===విశేషాలు===
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు