దుబాయ్ శీను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో బ్రోకర్ (వేణుమాధవ్) చేతిలో మొసపోయిన శ్రీనివాస్ అలియాస్ శీను (రవి తేజ) డబ్బుపోయి వెనక్కు తిరిగిరాలేక యాతనపడుతుంటారు. ఇదిలా ఉండగా పట్నాయక్ (కృష్ణ భగవాన్) అనే మరో మోసగాడు శీను, ఆయన ఫ్రెండ్స్ కు పావ్ బాజి పెట్టుకోవడానికి సాయం చేస్తున్నాననే సాకుతో వారిని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. అన్నను వెదకడానికి ముంబయి వచ్సిన మధుమతి (నయనతార) ని అనుకోకుండా కలుసుకున్న శీను ఆమె ప్రేమలో పడతాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని మధుమతికి చెబుతాడు. ఆ తరువాత శీను మధుమతికి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. పట్నాయక్, శీను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదనే నిజం మధుమతికి చెబుతాడు.
 
ఆమె తిరిగి తన స్వస్థలానికి వస్తుంది. ఇదిలా ఉండగా శీను తన మిత్రుడు చక్రిని (జెడి చక్రవర్తి) కలుసుకుంటాడు. పూజ (నేహ) ను ప్రేమిస్తున్న చక్రికి శీను సాయంతో వారు పెళ్లి చేసుకుంటారు. చక్రి, పూజలు శీను దుబాయ్ వెళ్లడానికి సాయపడతామని హామీ ఇస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తారు.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/దుబాయ్_శీను" నుండి వెలికితీశారు