అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను
పంక్తి 93:
 
[[బొమ్మ:Antarvedi 1.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణలో అంగళ్ళ వ్యాపారం]]
'''అంతర్వేది''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము, [[తూర్పు గోదావరి]] జిల్లా, [[సఖినేటిపల్లి]] మండలానికి చెందిన [[గ్రామము]].<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[బంగాళాఖాతం|బంగాళాఖాతపు]] సముద్రం [[గోదావరి]] నదీశాఖయైన [[వశిష్టానది]] సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. [[పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]]కు సమీపములో కల ఈ త్రికోణాకారపు [[దీవి]] పై ప్రసిద్ధి చెందిన [[లక్ష్మీనరసింహస్వామి]] వారి పురాతన ఆలయం ఉంది.
 
ఇది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నరసాపురం]] నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4153 ఇళ్లతో, 15605 జనాభాతో 3309 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8010, ఆడవారి సంఖ్య 7595. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4612 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 42. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587858<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533252.
 
[[బంగాళాఖాతం|బంగాళాఖాతపు]] సముద్రం [[గోదావరి]] నదీశాఖయైన [[వశిష్టానది]] సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. [[పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]]కు సమీపములో కల ఈ త్రికోణాకారపు [[దీవి]] పై ప్రసిద్ధి చెందిన [[లక్ష్మీనరసింహస్వామి]] వారి పురాతన ఆలయం ఉంది.
 
భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు {{coor d|16.3333|N|81.7333|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Antarvedi.html Falling Rain Genomics.Antarvedi]</ref> ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
==స్థలపురాణం==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి.
 
సమీప జూనియర్ కళాశాల మలికిపురంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సఖినేటిపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్‌ పోడూరులోను, మేనేజిమెంటు కళాశాల నర్సాపురంలోనూ ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శివకోడులోను, అనియత విద్యా కేంద్రం అమలాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[రాజోలు]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
అంతర్వేదిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఐదుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
 
డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
 
== తాగు నీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.
 
కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
 
== పారిశుధ్యం ==
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
 
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
అంతర్వేదిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.
 
ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.
 
వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
 
ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
అంతర్వేదిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 2018 హెక్టార్లు
 
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 108 హెక్టార్లు
 
* నికరంగా విత్తిన భూమి: 1183 హెక్టార్లు
 
* నీటి సౌకర్యం లేని భూమి: 537 హెక్టార్లు
 
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 646 హెక్టార్లు
 
== నీటిపారుదల సౌకర్యాలు ==
అంతర్వేదిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
* కాలువలు: 561 హెక్టార్లు
 
* ఇతర వనరుల ద్వారా: 85 హెక్టార్లు
 
== ఉత్పత్తి ==
అంతర్వేదిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
=== ప్రధాన పంటలు ===
[[వరి]]
 
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
చేపల వలలు
 
=== చేతివృత్తులవారి ఉత్పత్తులు ===
లేసుల అల్లిక
 
== గ్రామ విశేషాలు ==
 
===స్థలపురాణం===
[[కృత యుగము]] లోని మాట ఒకసారి [[నైమిశారణ్యం]]లో [[శౌనకాది మహర్షులు]] [[సత్రయాగం]] చేస్తున్న సమయంలో [[సూత]] మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి [[బ్రహ్మ]], నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.
 
===క్షేత్ర నామం===
[[బొమ్మ:narasihasvami temple antarvedi 1.jpg|thumb|right|250px|బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము) ]]
ఒకప్పుడు [[శివుడు|శివుని]] పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా [[బ్రహ్మ]] [[రుద్రయాగం]] చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.
వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.
 
===రక్తవలోచనుని కథ===
ఒకానొక సమయంలో రక్తావలోచనుడు ([[హిరణ్యాక్షు]]ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ [[గోదావరి]] నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి [[విశ్వామిత్రుడు]]కి [[వశిష్ఠుడు]]కి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహా[[విష్ణువు]]ను ప్రార్థించగా మహావిష్ణువు [[లక్ష్మి|లక్ష్మీ]] సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి [[సుదర్శనం|సుదర్శనము]]ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన [[మాయాశక్తి]]ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా [[రక్తకుల్య]] అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ [[లక్ష్మీనృసింహస్వామి]]గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన [[చక్రాయుధము]]ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.
 
===ఆలయ నిర్మాణ విశేషాలు===
మొదటి ఆలయము శిథిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు [[కొపనాతి కృష్ణమ్మ|శ్రీ కొపనాతి కృష్ణమ్మ]]<ref>[http://www.telugudanam.co.in/samskruti/puNyaksheatraalu/aMtarvaedi.php ఆలయ విశేషాలు]</ref>. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త శ్రీ కొపనాతి ఆదినారాయణ గారు వీరి తండ్రిగారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా [[విగ్రహము]] ఉంది. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా ([[నడవా]]) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి [[యాత్రికులు]] పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు [[ప్రకృతి]] తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయమునకు దూరముగా [[వశిష్టానది]]కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసారు.
ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .
 
==సందర్శనాస్థలములు==
====వశిష్టాశ్రమము====
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము ఉంది. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన [[ఆశ్రమము]] నిర్మించబడింది.
ఈ ఆశ్రమము వికసించిన [[కమలము]] మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ [[సరోవరము]] మధ్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా [[ద్యానమందిరం]], పఠనాశాల, యోగశాల, [[విశ్రాంతి]] మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు ఉన్నాయి.
 
====దీప స్తంభం====
దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా [[దీప స్తంభం]] ([[లైట్ హౌస్]]) ఉంది. దీనిని [[బ్రిటిష్]] పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విద్యార్థులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. [[లైట్ హౌస్]] పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి ఉంది. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, వశిష్టాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతము వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.
 
====అశ్వరూడాంభిక(గుర్రాలక్క) ఆలయము====
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో ఉంది. స్థల పురాణ రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి [[సుదర్శనము]]ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన [[రక్తం]] అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.
====అన్న చెళ్ళెళ్ళ గట్టు====
సముద్రములో [[వశిష్ట]] నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత
 
====సముద్రతీరం====
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, [[బీచ్]] వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా [[వశిష్టాశ్రమం]], అన్న చెళ్ళెళ్ళ గట్టు, [[దీపస్తంభం]] (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.
 
====ఇతర ఆలయాలు====
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామము.<ref name="ReferenceA"/>.లోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి.
 
Line 158 ⟶ 247:
బొమ్మ:Vasistasram-antarvedi.jpg|నీటిలో కల వశిష్టాశ్రమ ప్రధాన కట్టడం
</gallery></center>
; దేవస్థానం చిరునామా:
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము;అంతర్వేది, సఖినేటిపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఫోన్: 08862-259313
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 15, 605 - పురుషుల సంఖ్య 8, 010 - స్త్రీల సంఖ్య 7, 595 - గృహాల సంఖ్య 4, 153
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15, 763.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 8, 039, మహిళల సంఖ్య 7, 724, గ్రామంలో నివాసగృహాలు 3, 743 ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు