కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కథ పూర్తి |
|||
పంక్తి 19:
కాలేజీలో చదివే రాజు అమాయకుడు, పిరికివాడు. స్నేహితులందరూ అతన్ని చిన్నప్పటి ముద్దుపేరైన కొబ్బరి బోండాం పేరుతో ఏడిపిస్తూ ఉంటారు. రాజు మేఘమాల అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. సర్వనామం, కపూర్ అనే ఇద్దరు కలిసి యువకులకు హీరోలుగా చేస్తానని నమ్మించి క్రూరమైన బాక్సింగ్ ఆట ఆడించి అందులో వాళ్ళు దెబ్బలు తిని చనిపోతుంటే వీడియోలో చిత్రీకరించి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. మేఘమాల అన్నయ్యను తనకు రావాల్సిన డబ్బు కోసం కపూర్ బెదిరిస్తుంటాడు. అలా చెల్లించని పక్షంలో అతని చెల్లెలిని తీసుకెళ్ళిపోతానని బెదిరిస్తుంటాడు. మేఘమాల రాజు తనని పెళ్ళి చేసుకోవాలంటే తన అన్నయ్యను ఒప్పించమంటుంది. అతను తన చెల్లెల్ని పెళ్ళి చేసుకోవాలంటే ఉద్యోగం సంపాదించి దానితో పాటు ఐదు లక్షలు ఇవ్వమని అడుగుతాడు అంతే కాకుండా అతని దగ్గరకు వచ్చినప్పుడల్లా రాజును ఇంట్లో పనులన్నింటికీ వాడుకుంటూ ఉంటాడు.
ఉద్యోగం సంపాదించడం కోసం సర్వనామం దగ్గరికి వెళతాడు రాజు. సర్వనామం దొంగతనంగా తీసిన వీడియో క్యాసెట్లను వేరే వాళ్ళకు ఇచ్చి డబ్బులు వసూలు చేసే పని అప్పచెబుతాడు. కానీ సర్వనామం కొడుకు సురేష్ రాజును మోసం చేసి ఆ డబ్బును తస్కరిస్తాడు. సర్వనామం ఆ డబ్బు ఎలాగైనా కట్టమని రాజును నిలదీస్తాడు. రాజు ఏమీ చేయలేకపోవడంతో సర్వనామం రాజు తల్లిని పిలిచి అతను ప్రేమ విషయాన్ని చెప్పేస్తాడు. రాజు తల్లి అతన్ని నిలదీస్తుంది. డబ్బు కట్టే దాకా రాజు తల్లి తన దగ్గరే ఉంటుందని చెబుతాడు సర్వనామం. తన దగ్గర సూట్ కేసు డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎదురైనా తన పిరికితనంతో వారిని ఏమీ చేయలేకపోతాడు రాజు. మేఘమాల కూడా అతని చేతకానితనాన్ని చూసి హేళన చేస్తుంది. నిస్సహాయ స్థితిలో రాజు
ఆ నాణెం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తన దగ్గర డబ్బు దొంగిలించిన దొంగలను మట్టి కరిపించి సురేష్ ను నేరం ఒప్పుకునేలా చేస్తాడు. సర్వనామం మాత్రం తన కొడుకు డబ్బు దొంగిలించాడని ఒప్పుకోడు. సర్వనామాన్ని బెదిరించి తల్లిని తీసుకెళ్ళాలని చూస్తాడు రాజు.
రాజు మేఘమాల అన్నయ్య దగ్గరకు వెళ్ళి డబ్బు లేకుండానే
ఆత్మవిశ్వాసంలో బరిలోకి దిగిన రాజు నాణెం తన దగ్గర లేదనే విషయం తెలియగానే నీరుగారిపోయి చావు దెబ్బ తింటాడు. ఈలోపు నాణేన్ని మింగిన సురేష్ ప్రొఫెసర్ కంటబడటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ప్రొఫెసర్ పరుగున వెళ్ళి మరో నాణేన్ని రాజుకిచ్చి అదే అతని అదృష్ట నాణెంగా నమ్మిస్తాడు. దాంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రాజు అవలీలగా శత్రువును మట్టికరిపిస్తాడు. ఈలోపు పోలీసులు వచ్చి సర్వనామాన్ని, కపూర్ ను అదుపులోకి తీసుకుంటారు. అసలు ఆ నాణెంలో అసలు ఏ శక్తీ లేదనీ కేవలం రాజులో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి అలా అబద్ధం చెబుతానని రాజుకు చెబుతాడు ప్రొఫెసరు. రాజు ఆ నాణేన్ని పక్కకు విసిరేసి తన స్వశక్తిని నమ్ముకుంటానని చెబుతాడు. మేఘమాల, రాజు పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
|