దేవులపల్లి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''దేవులపల్లి వెంకటేశ్వరరావు''' కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్ సభ్యుడు, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి.<ref>[http://namasthetelangaana.com/Editorial-News-in-Telugu/%E0%B0%86-%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-1-7-489612.html ఆ యోధున్ని మరిచిపోదామా? SUN,MAY 31, 2015]</ref> 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గుండెలాంటి నల్గొండ జిల్లా పార్టీ సారధిగా అటు పోరాటంలోనూ, ఇటు సిద్ధాంత చర్చలోనూ అగ్రభాగాన నిల్చిన వ్యక్తి.
==జీవిత విశేషాలు==
ఆయన [[1917]] [[జూన్ 2]]న [[వరంగల్‌వరంగల్ జిల్లా]] [[ఇనుగుర్తి]]లో జన్మించారు. కానీ ఆయన స్వస్థలం [[సూర్యాపేట]] సమీపంలోని చందుపట్ల గ్రామం. ఆయన సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన బాలవితంతువైన శ్రీరంగమ్మను వివాహం చేసుకున్నారు. దేవులపల్లి ప్రాథమిక విద్యాభ్యాసం చందుపట్ల సమీపంలోని తిరుమలగిరి, నామవరం గ్రామాల్లోనూ, మాధ్యమిక విద్య సూర్యాపేటలోనూ, హైస్కూలు చదువు వరంగల్‌లోనూ సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరింనబడంతో జబల్పూరు వెళ్ళి అక్కడ బి.ఎ. డిగ్రీ పూర్తి చేసుకున్నారు. అక్కడే జాతీయోద్యమంతోనూ కమ్యూనిస్టు సాహిత్యంతోనూ పరిచయం ఏర్పడింది.<ref name=విప్లవ మార్గదర్శి">{{cite news|title=విప్లవ మార్గదర్శి డీవీ|url=http://www.andhrajyothy.com/Artical?SID=128626|accessdate=7 June 2016|agency=Andhra Jyothi|publisher=చెరుకూరి సత్యనారాయణ|date=12 July 2015|ref=విప్లవ మార్గదర్శి డీవీ}}</ref>
స్వగ్రామం వచ్చిన ఆయన 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అప్పటికే [[నిజాం]] పాలనలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది. హైదరాబాద్‌లో ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ నిర్మాతల్లో ఆయన ప్రథములు. ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకున్న కాలంలో అంటే 1941-51 దశాబ్దంలో కీలకమైన [[నల్గొండ జిల్లా]] పార్టీ బాధ్యతలు చేపట్టి యూనియన్‌ సైన్యాలపై కొనసాగిన పోరాటానికి కూడా నాయకత్వం వహించి పోరాట విరమణ వాదాన్ని వ్యతిరేకించాడు. తెలంగాణ పోరాట చరిత్రను ఆయన సవివరంగా గ్రంథస్థం చేసినా అందులో మొదటి భాగమే అందుబాటులోకి వచ్చింది. ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటం’. ‘హైదరాబాద్‌ కౌల్దారీ చట్టం’ అనే పుస్తకాలు రాశారు. పోరాట విరమణ తర్వాత కాలంలో 1957లో నల్గొండ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయారు. ఆయన మొత్తం పొలాన్ని కౌలుదారులకే ఇచ్చేశాడు. 1962లోనూ, 1964లోనూ డిటెన్యూగా, 1970లో నాగిరెడ్డి కుట్రకేసులో ముద్దాయిగానూ జైలు జీవితం గడిపారు. కుట్ర కేసులో నాలుగు సంవత్సరాలు కారాగార శిక్ష విధించగా బెయిల్‌పై విడుదలయ్యారు.<ref name=విప్లవ మార్గదర్శి"/>