బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Bankupalli.png|right]]
'''[[బంకుపల్లె మల్లయ్యశాస్త్రి]]''' ప్రముఖ పండితుడు. [[సంఘసంస్కర్త]]. [[రచయిత]].
==జననం==
ఇతడు [[1876]]వ సంవత్సరం [[ఏప్రిల్ 29]]వ తేదీకి సరియైన [[ధాత]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు [[పునర్వసు]]నక్షత్రము, తులాలగ్నములో [[గంజాం]] జిల్లా [[సింగుపురం (శ్రీకాకుళం మండలం)|సింగుపురం]] గ్రామంలో తన మాతామహుని ఇంటిలో జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19798 కావ్యతీర్థ, పురాణవాచస్పతి బంకుపల్లె మల్లయ్యగారు - పట్నాల అన్నయ్యశాస్త్రి - భారతి మాసపత్రిక- సంపుటి 13, సంచిక 5 - 1936, మే - పేజీలు 561- 567]</ref>. ఇతని స్వగ్రామము [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]] మండలానికి చెందిన [[ఉర్లాం]] గ్రామము. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ మరియు గంగన్న. ఇతనిది కృష్ణ యజుశ్శాఖ, ఆపస్తంబ సూత్రుడు మరియు భారద్వాజ గోత్రుడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
ఇతడు తన ఐదవ యేట తన తండ్రివద్ద[[తండ్రి]]<nowiki/>వద్ద వేదాధ్యయనము ప్రారంభించాడు. తరువాత [[ఉర్లాం]] జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడైన భళ్లమూడి లక్ష్మణశాస్త్రి వద్ద సంస్కృతము నేర్చుకున్నాడు. తన పదహారవ యేడు వచ్చేసమయానికి పంచకావ్యాలు పూర్తిగా చదివాడు. తరువాత [[పర్లాకిమిడి]] రాజా వారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ భళ్లమూడి వెంకటశాస్త్రివద్ద శృంగారనైషధము, అభిజ్ఞాన శాకుంతలము చదివాడు. తరువాత పరవస్తు రంగాచార్యుల వద్ద సిద్ధాంతకౌముది పూర్తిచేశాడు. కూరెళ్ల సూర్యనారాయణశాస్త్రి వద్ద తర్కశాస్త్రము చదువుకున్నాడు. పోకల సింహాచలం వద్ద సంగీతము నేర్చుకున్నాడు. బంకుపల్లి కామశాస్త్రి వద్ద మంత్రశాస్త్రాన్ని అభ్యసించాడు. భళ్లమూడి దక్షిణామూర్తి శాస్త్రివద్ద పంచదశ ప్రకరణములు, గీతాభాష్యము చదువుకున్నాడు. [[శ్రీకూర్మం]] సంస్కృత పాఠశాలా పండితుడైన నౌడూరి వెంకటశాస్త్రి వద్ద మనోరమ, శబ్దరత్నములు మరియు పారిభాషేందుశేఖరము చదివాడు. [[గిడుగు రామమూర్తి]] పంతులు వద్ద [[ఇంగ్లీషు]] చదివాడు. మంత్రశాస్త్రవిద్యలో తన సహాధ్యాయి అయిన గంటి సూర్యనారాయణశాస్త్రి వద్ద వేదాంత, మీమాంస శాస్త్రాలను నేర్చుకున్నాడు. నీలమణి పాణిగ్రాహి వద్ద సూర్యసిద్ధాంత దర్పణాలను చదివి దృక్సిద్ధ పంచాంగాలను ఐదారు సంవత్సరాలు వెలువరించాడు.
 
==ఉద్యోగము==
ఇతడు తన 21వ యేట [[శ్రీకాకుళం]] హైస్కూలులో తెలుగు పండిత పదవికి 18మంది పండితులతో పోటీపడి ప్రథముడిగా నెగ్గి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ రెండు [[సంవత్సరాలు]] పనిచేశాడు. తర్వాత కొంతకాలం [[లుకలాం]] గ్రామంలో కన్నేపల్లి రామావధాని కుమారులకు సంస్కృతం బోధించాడు. ఆ తర్వాత [[పర్లాకిమిడి]] రాజా వారి ఇంగ్లీషు కళాశాలలో తెలుగు పండితపదవిని చేపట్టాడు. [[బరంపురం]] సిటీ కాలేజీలో కూడా సంస్కృతాంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశాడు.
 
==కుటుంబము==
ఇతనికి ఇరువులు భార్యలు, ఏడుగురు [[కొడుకు|కుమారులు]], ఒక కుమార్తె[[కూతురు|కుమార్]]<nowiki/>తె కలిగారు. ఇతని రెండవ భార్యపేరు వెంకటరత్నమ్మ. ఈమె పర్లాకిమిడి సంస్థాన సంగీత విద్వాంసుడైన పోకల నరసింహంగారి కుమార్తె. విదుషీమణి. మల్లయ్య శాస్త్రి కుమార్తె పేరు కృష్ణవేణమ్మ. ఇతడు తన కుమార్తెకు శతావధాని [[వేదుల సత్యనారాయణశాస్త్రి]]కి ఇచ్చి పునర్వివాహం చేశాడు.
 
==రచనలు==