*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
==మియాపూర్ నాగోలు కారిడార్==
మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్ మధ్య 30 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఇందులో భాగంగా 8 కి.మీ. పొడవైన నాగోలు- మెట్టుగూడ పనులు పూర్తయ్యాయి. 12 కి.మీ. పొడవైన మియాపూర్- ఎస్ఆర్నగర్ మెట్రో మార్గాన్ని కూడా పూర్తి చేశారు. ఈ కారిడార్ను మొత్తం కలిపే ఎస్ఆర్నగర్ - మెట్టుగూడ వరకు 10 కిలోమీటర్ల పనులు సికింద్రాబాద్ దగ్గర క్లిష్టమైన స్టీల్ అమీర్పేట దగ్గర ఇంటర్ ఛేంజ్ జంక్షన్ నిర్మాణం పూర్తయింది. ఈ మొదటి దశ 30 కిలోమీటర్ల లైనులో 17 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ వ్యవస్థ ఉంది.