కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
[[బొమ్మ:Sankarabharanam.jpg|thumbnail|right|250px|తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి]]
'''''కళాతపస్వి''''' గా చిరపరిచితమైన [[పద్మశ్రీ]] '''కాశీనాధుని విశ్వనాధ్''' [[తెలుగు సినిమా]] దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, '''కె.విశ్వనాథ్'''. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను [[దాదాసాహెబ్ ఫాల్కే]] పురస్కారాన్ని అందుకున్నాడు.
==వ్యక్తిగత జీవితం==
ఆయన స్వస్థలం [[గుంటూరు]] జిల్లా, రేపల్లె తాలూకాలోని [[పెదపులివర్రు (భట్టిప్రోలు)|పెద పులివర్రు]] అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం [[విజయవాడ]]కి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ [[గుంటూరు]] హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.<ref>[http://www.hindu.com/2010/07/25/stories/2010072561110500.htm Andhra Pradesh / Guntur News : Society needs good films, says K. Viswanath]. The Hindu (25 July 2010). Retrieved on 2013-07-28.</ref><ref>[http://www.hindu.com/fr/2005/07/22/stories/2005072201430300.htm Entertainment Hyderabad / Events : Viswanath felicitated]. The Hindu (22 July 2005). Retrieved on 2013-07-28.</ref> <ref name="auto2">{{cite news| url=http://www.hindu.com/2006/09/19/stories/2006091916980300.htm | work=The Hindu | title=Reporter's Diary | date=19 September 2006}}</ref>
 
==సినీ ప్రస్థానం ==
[[చెన్నై]] లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగానిపుణుడి (సౌండ్ రికార్డిస్టు) గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి,మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]] తో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన [[అక్కినేని నాగేశ్వరరావు]] తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన [[ఆత్మ గౌరవం]] సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది.<ref>{{Cite book|title=సితార: పాటల పల్లకి శీర్షిక పరువము పొంగే వేళలో షెహనాయి అందుకే|last=షణ్ముఖ|first=|publisher=ఈనాడు|year=2017|isbn=|location=హైదరాబాదు|pages=16}}</ref> [[సిరిసిరిమువ్వ]] సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
 
విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది [[శంకరాభరణం]]. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని ''[[సాగరసంగమం]]'', ''[[శృతిలయలు]]'', ''[[సిరివెన్నెల]]'', ''[[స్వర్ణకమలం]]'', ''[[స్వాతికిరణం]]'' మొదలైనవి.
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు