గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| years_active = 2006-ఇప్పటివరకు
}}
'''శొంఠి [[గీతా మాధురి]] ''' ఒక తెలుగు సినీ గాయని. [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో అనేక శ్రావ్యమైన [[పాటలు]] పాడింది. నచ్చావులే([[2008]]) సినిమాలో ఆమె పాడిన ''నిన్నే నిన్నే'' పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి [[నంది అవార్డు]] అందుకుంది. [[మాటీవి]]లో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.
== నేపథ్యం ==
గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బీహెచ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన [[కుటుంబము|కుటుంబం]]. ఆమె చాలా చిన్న వయసులోనే [[హైదరాబాద్]] కు మారిపోయారు. ఆమె [[ప్రాథమిక విద్య]] హైదరబాద్, [[వనస్థలిపురం]]లోని లయోలా పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో చదువుకున్నారు. చిన్నప్పట్నుంచే ఆమె [[సంగీతము|సంగీతం]] అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. [[ఈటీవి]]లో ప్రసారమైన "సై సింగర్స్ ఛాలెంజ్ "లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
 
కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలోని ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేశారు.
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు