వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 41:
వీరు తమ స్నేహితులు కొందరితో అమెచ్యూర్ డ్రమెటిక్ సొసైటీ అనే నాటకరంగ సంస్థను స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత నాటకాలను ప్రదర్శించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించినది ఈ సంస్థే. వీరు ప్రత్యేకంగా నాటకాలలో నటించకున్నా నటులను తీర్చిదిద్దడంలో, నాటకాల ఎంపికలో ప్రధాన పాత్రను పోషించేవారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ ఆంధ్రజనమహాసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సభలలో వీరి స్వాగతోపన్యాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది.
వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. ఆయుర్వేదసూత్రములు అనే చిన్న గ్రంథాన్ని సవరించి సటీకతో ప్రకటించారు. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో 'రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు', '[[వేదము వేంకటరాయ శాస్త్రి|వేదము వేంకటరాయశాస్త్రులు]] గారు' , 'వెన్నెలకంటి దరరామయ్య గారు', 'శనగవరపు పరదేశిశాస్త్రులు గారు'వంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించారు. మరియు భరతముని
వీరు ఆజానుబాహువులు. మంచి దేహపుష్ఠి కలవారు. నిరంతరవిద్యావ్యాసంగపరాయణులు.
|