వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
వీరు తమ స్నేహితులు కొందరితో అమెచ్యూర్ డ్రమెటిక్ సొసైటీ అనే నాటకరంగ సంస్థను స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత నాటకాలను ప్రదర్శించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించినది ఈ సంస్థే. వీరు ప్రత్యేకంగా నాటకాలలో నటించకున్నా నటులను తీర్చిదిద్దడంలో, నాటకాల ఎంపికలో ప్రధాన పాత్రను పోషించేవారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ ఆంధ్రజనమహాసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సభలలో వీరి స్వాగతోపన్యాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది.
 
వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. ఆయుర్వేదసూత్రములు అనే చిన్న గ్రంథాన్ని సవరించి సటీకతో ప్రకటించారు. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో 'రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు', '[[వేదము వేంకటరాయ శాస్త్రి|వేదము వేంకటరాయశాస్త్రులు]] గారు' , 'వెన్నెలకంటి దరరామయ్య గారు', 'శనగవరపు పరదేశిశాస్త్రులు గారు'వంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించారు. మరియు భరతముని [[ప్రణీత నాట్యశాస్త్రము]] లోనినాట్యశాస్త్రములోని చతుర్ధాధ్యాంతర్గత తాండవ లక్షణమును విలక్షణముగా వివరములతో [[ఆంగ్లభాష|ఆంగ్లేయ]] భాషలోకి అనువదించారు. ఈ గ్రంథము1936సం. లో [[అన్నామలై]] ఆచార్యునిగా నుండిన మాన్యులు శ్రీ. బిజయేటి నారాయణస్వామి నాయుడు గారు ప్రకటించినారు. (This book was available in Ethnological Dance centre- New York- Is the school of Natya Founded by La Meri and Ruth St. Denis). సంస్కృత రామాయణంలోని లోకోక్తులు, శబ్దరత్నాకరములో లేని కొన్ని మాటలు వాటి అర్థములు వీరి అముద్రిత రచనలలో కొన్ని.
 
వీరు ఆజానుబాహువులు. మంచి దేహపుష్ఠి కలవారు. నిరంతరవిద్యావ్యాసంగపరాయణులు.
"https://te.wikipedia.org/wiki/వంగోలు_వెంకటరంగయ్య" నుండి వెలికితీశారు