జి.ఎస్.అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
'''జి.ఎస్.అరండేల్''' (1878-1945) భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషిచేసిన ఆంగ్లేయుడు. [[అనీ బిసెంట్]] అనుయాయి.
==ఆరంభ జీవితం==
జార్జ్ సిడ్నీ అరండేల్ [[1878]], [[డిసెంబర్ 1]]వ తేదీన ఇంగ్లాండులోని సర్రే అనే ప్రాంతంలో జన్మించాడు<ref name="Theosophical Society, Adyar">{{cite web|last1=వెబ్ మాస్టర్|title=GEORGE SYDNEY ARUNDALE (1878 - 1945)|url=http://www.ts-adyar.org/content/george-sydney-arundale-1878-1945|website=The Theosophical Society, Adyar|accessdate=11 December 2017}}</ref>. ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మరణించింది. ఇతని అత్త మిస్ ఫ్రాన్సెస్కా అరండేల్ ఇతడిని పెంచి పెద్దచేసింది. ఫ్రాన్సెస్కా 1881లో [[దివ్యజ్ఞాన సమాజము|థియొసాఫికల్ సొసైటీ]]లో చేరింది. ఆ సమాజం స్థాపకులలో ఒకరైన హెలీనా బ్లావట్‌స్కీ తరచూ వారింటికి అతిథిగా వస్తుండడం వల్ల బాలుడైన అరండేల్‌కు ఆమెను కలుసుకునే అవకాశం దక్కింది. ఇతడు కొంతకాలం జర్మనీలోను, మరికొంత కాలం ఇంగ్లాండులోను విద్యను అభ్యసించాడు. 1900లో కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు.
== భారతదేశానికి రాక==
1902లో ఇంగ్లాండులోని క్వీన్స్ హాలులో [[అనీ బిసెంట్]] ఉపన్యాసం విని ప్రభావితుడైన అరండేల్ ఆమెతో పాటు భారతదేశానికి వచ్చి ఆమె అనుచరునిగా రాజకీయరంగంలో పనిచేశాడు<ref name=పత్రిక>{{cite news|last1=డి.రామలింగం|title=డా.జి.యస్.అరండేలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=14201|accessdate=11 December 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 347|date=25 March 1979}}</ref>. ఇతడు ఆల్ ఇండియా హోమ్‌ రూల్ లీగ్‌కు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమించబడి ప్రభుత్వం చేత అరెస్టు చేయబడి మూడు నెలలు అనీ బిసెంట్‌తో పాటు కారాగారశిక్ష అనుభవించాడు. ఇద్దరూ కలిసి భారతీయుల జాతీయ ఆశయాలకు అనుగుణమైన విద్యాపథకాన్ని సిద్ధం చేశారు. ఇతడు వారణాశి లోని సెంట్రల్ హిందూ హైస్కూలుకు చరితోపన్యాసకుడిగా, ఆ తర్వాత హెడ్‌మాస్టరుగా తరువాత ఆ సంస్థ సెంట్రల్ హిందూ కాలేజీగా మారిన తరువాత ఆ సంస్థకు ప్రిన్స్సిపాల్‌గా పనిచేశాడు<ref name="Theosophical Society, Adyar" />. ఈ సంస్థే తరువాతి కాలంలో [[మదన్ మోహన్ మాలవీయ]] ఆధ్వర్యంలో [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]గా రూపాంతరం చెందింది. విద్యాసంస్థల స్థాపనకు ఇతడు అనీ బిసెంటుకు తోడ్పడి అనేక మాంటిస్సోరి పాఠశాలల స్థాపనకు పాటుపడ్డాడు. ఇతడు 1920లో [[రుక్మిణీదేవి అరండేల్|రుక్మిణీదేవి]]ని ప్రేమించి పెళ్ళి చెసుకున్నాడు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన రుక్మిణీదేవికి కళలపట్ల ఉన్న ఆసక్తిని గమనించి అరండేల్ ఆమెను ప్రోత్సహించి ఆమె జీవితం కళారంగానికి అంకితం చేయడానికి తోడ్పడ్డాడు<ref name=పత్రిక />. 1924 నుండి 1926 వరకు ఇతడు మద్రాసు లేబర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా వున్నాడు. భారతదేశంలో మొట్టమొదటి లేబర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇతడే. ఈ సమయంలో ఇతడు కార్మికులకు ఎక్కువ కనీసవేతనం, తక్కువ పనిగంటలు సాధించిపెట్టాడు. 1925లో ఇతడు లిబరల్ కాథలిక్ చర్చిలో చేరాడు. తరువాతి కాలంలో ఆ చర్చి బిషప్‌లలో ఒకడుగా పనిచేశాడు<ref name="Theosophical Society, Adyar" />. మరోవైపు దివ్యజ్ఞాన సమాజం తరఫున యూరోపు, ఆస్ట్రేలియా దేశాలు విస్తృతంగా పర్యటించాడు.
==దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షడుగా==
1933లో అనీ బిసెంట్ మరణానంతరం అరండేల్ ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1945 వరకు దివ్యజ్ఞానసమాజం అభివృద్ధికి ఇతడు కృషి చేశాడు. ఈ సమాజం పక్షాన ఒక జాతీయ విశ్వవిద్యాలయాన్ని [[రవీంద్రనాథ్ టాగూర్]] కులపతిగా నియమించి ప్రారంభించాడు. 1934లో బిసెంట్ మెమొరియల్ స్కూలును అడయార్‌లో ప్రారంభించాడు<ref name="Theosophical Society, Adyar" />.
==గుర్తింపు==
ఇతడు నాలుగు దశాబ్డాలపాటు విద్య, రాజకీయ, కార్మిక, పత్రికారచన, స్కౌట్, యోగ, థియోసఫీ రంగాలలో భారతదేశానికి ఎనలేని సేవలను అందించాడు. 1926లో ఇండోర్ సంస్థానం ఇతడిని ఆ సంస్థానపు విద్యామంత్రిగా నియమించి గౌరవించింది<ref name="Theosophical Society, Adyar" />. విద్యారంగంలో ఇతడు చేసిన సేవలకు గుర్తింపుగా నేషనల్ యూనివర్శిటీ, మద్రాసు ఇతడికి గౌరవ డాక్టరేట్ ఇన్ లిటరేచర్‌తో సత్కరించింది. శ్రీభారతధర్మ మహామండలి, వారణాశి వారు ఇతడిని "విద్యాకళానిధి" అనే బిరుదుతో సత్కరించారు<ref name="Theosophical Society, Adyar" />.
==మరణం==
"మీ నాగరికత, సంస్కృతి ఇతరుల వాటికన్న గొప్పవి. మీరు ఇతరులను అనుకరించవలసిన పనిలేదు." అని భారతీయులకు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన డా.జార్జ్ సిడ్నీ అరండేల్ [[1945]], [[ఆగష్టు 12]]వ తేదీన మద్రాసులోని ఆడయార్‌లో మరణించాడు<ref name=పత్రిక />.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.అరండేల్" నుండి వెలికితీశారు