శ్రీహరి నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''[[శ్రీహరి నిఘంటువు]]''' [[రవ్వా శ్రీహరి]] గారు సంకలనం చేసిన [[తెలుగు]] [[నిఘంటువు]]. దీనినే సూర్యరాయాంధ్ర నిఘంటుశేషం అని కూడా అంటారు.
 
పిఠాపురం రాజా సూర్యారావు బహదూర్ గారి అండదండలతో, [[జయంతి రామయ్య పంతులు]] గారి ఆధ్వర్యంలో అనేక పండితుల కృషి ఫలితంగా '[[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]]' అనే పేర ఒక బృహన్నిఘంటువు నిర్మాణం జరిగింది. ప్రముఖ భాషా సాహితీ సంస్థ [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] దీన్ని ప్రచురించింది. ప్రామాణికమైన తెలుగు నిఘంటువుల్లో దీనికి ప్రముఖ స్థానం ఉంది. [[నిఘంటువు|నిఘంటు]] నిర్మాణకాలంనాటికి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని, వివిధ నిఘంటువులను ఆధారంగా చేసుకొని ఈ నిఘంటు నిర్మాణం జరిగింది. ఈ నిఘంటు నిర్మాణం 1911లో ప్రారంభింపబడి 1972లో పూర్తిగావింపబడింది. ఇది మొత్తం ఏడు సంపుటాల్లో ప్రచురింపబడినది.
 
ఏ నిఘంటువైనా సర్వసమగ్రమని చెప్పలేం. తరువాతికాలంలో లభించిన సామగ్రినిబట్టి, భాషలో[[భాష]]<nowiki/>లో వచ్చిన మార్పులనుబట్టి నిఘంటువులో ఎన్నో మార్పులకు, చేర్పులకు అవకాశం ఉంటుంది. [[అమరకోశం]] మొదలైన ఎన్నో ప్రాచీన నిఘంటువులకు కూడా అనంతరకాలంలో శేషగ్రంథాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సుమారు అరవై సంవత్సరాలకు పూర్వం సిద్ధం చేయబడిన సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా భాషలో తరువాత వచ్చిన మార్పుల ఆధారంగా అందులో లేని ఆరోపాలను చేరుస్తూ దీనికి ఒక అనుబంధ నిఘంటువును సిద్ధం చేయవలసిన ఆవశ్యకం ఎంతో ఉంది. దీన్ని గుర్తించి [[రవ్వా శ్రీహరి]] గత ఏడెనిమిది సంవత్సరాలుగా కృషిచేసి వివిధ ఆకరాలను పరిశీలించి ఇందులో లేని ఆరోపాలనెన్నింటినో సేకరించి సూర్యరాయాంధ్ర నిఘంటువుకు శేషగ్రంథంగా ఈ 'శ్రీహరి నిఘంటువు'ను సిద్ధం చేయడం జరిగింది.
 
== కొన్ని వివరాలు ==
పంక్తి 35:
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించని తాళ్లపాక కవుల సాహిత్యం - ప్రధానంగా అన్నమయ్య కీర్తనలు; క్షేత్రయ్య పదాలు, సారంగపాణి పదాలు మొదలైన పదసాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; కాటమరాజు కథలు, [[బొబ్బిలియుద్ధం]] మొదలైన జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; రాయవాచకం, సిద్ధేశ్వర చరిత్ర మొదలైన చారిత్రక గ్రంథాలు, కట్టా వరదరాజు శ్రీరామాయణం, [[పల్నాటి వీరచరిత్ర]] మొదలైన ద్విపద గ్రంథాలు; యక్షగాన-సాహిత్యం; [[కాశీయాత్ర చరిత్ర]], [[సాక్షి వ్యాసాలు]] మొదలైన వచన గ్రంథాలు - వీటన్నిటినీ సంప్రతించి ఎన్నో ఆరోపాలు సేకరించి ఇందులో పొందుపరచడం జరిగింది.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రదించని తూము రామదాసకవి ఆంధ్రపద నిధానము (1930), సర్వాంధ్రసార సంగ్రహము, మారేపల్లివారి నుడికడలి (అముద్రితం) మొదలైన నిఘంటువుల నుండి ఎన్నో దేశ్యపదాలను సేకరించి ఇందులో చేర్చడం జరిగింది. ఆంధ్రపద నిధానంలో దాదాపు 250 దేశ్యపదాలు లభ్యమైనాయి.
# సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించిన [[ఆంధ్ర మహాభారతం]], ఆంధ్ర మహాభాగవతం, హంసవింశతి, శుకసప్తతి మొదలైన గ్రంథాలలో కూడా వారి దృష్టికి రాక తప్పిపోయిన ఆరోపాలను కూడా ఎన్నింటినో గుర్తించి ఈ నిఘంటువులో చేర్చడం జరిగింది.
# కేవలం ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలనుండేకాక ఆధునిక సాహిత్యం (నవలలు, కథలు, కవిత్వం మొదలైనవి) నుండి కూడా సేకరింపబడిన ఎన్నో వాడుకపదాలు ఇందులో ఆరోపాలుగా గ్రహింపబడ్డాయి.
# పూర్వ నిఘంటువుల్లో మాండలికపదాలకు, నిత్యవ్యవహారంలో ఉన్న అనేక పదాలకు స్థానం కనిపించదు. సాహిత్యమంతటా ఒకేచోట, ఒక్కసారి మాత్రమే ప్రయోగింపబడ్డ పదానికి కూడా నిఘంటువుల్లో స్థానం ఇస్తున్నప్పుడు లక్షలాది జనం నాలుకలపై ఉండి నిఘంటువుల్లోకి ఎక్కకపోవడం అపచారమే అనిపిస్తుంది. కనుక మాండలిక పదాలు, జనుల నిత్యవ్యవహారంలోని పదాలు ఎన్నో ఇందులో సంగ్రహింపబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/శ్రీహరి_నిఘంటువు" నుండి వెలికితీశారు