విశ్వ హిందూ పరిషత్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 29 ఆగష్టు 1964 → 1964 ఆగష్టు 29, ఆగష్టు → ఆగస్టు, → using AWB
→‎మూలాలు: లింకులు
పంక్తి 34:
'''విశ్వ హిందూ పరిషత్''' ను సంక్షిప్తంగా '''వి.హెచ్.పి''' అంటారు. ఇది భారతదేశంలోని [[హిందూ]] మితవాద సంస్థ మరియు హిందుత్వ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇది 1964 లో స్థాపించబడింది, దీని ప్రధాన లక్ష్యం హిందూ సమాజమును ఏకీకృతం చేయడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం. విశ్వ హిందూ పరిషత్ హిందూ జాతీయ సంస్థల యొక్క గొడుగు సంఘ్ పరివార్ కు చెందినది. ఇది హిందూ దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణలలో, గోసంరక్షణ, మత మార్పిడి వంటి అంశాలలో ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.
 
విశ్వ హిందూ పరిషత్ ను కేశవరాం కాశీరాం శాస్త్రి 1964 లో స్థాపించారు. హిందూ ఆధ్యాత్మిక నేత చిన్మయనంద[[చిన్మయానంద]], పూర్వ [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సభ్యుడు ఎస్.ఎస్.ఆప్టే, నందారి సిక్కుల యొక్క ఉన్నత ఆధ్యాత్మిక అధిపతి సద్గురు జగ్జీత్ సింగ్ మరియు సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ సహ వ్యవస్థాపకులు. దీనికి చిన్మయనంద వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆప్టే వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.
 
"విశ్వ హిందూ పరిషత్" అనే ఈ పేరును సంస్థ సమావేశంలో ప్రతిపాదించి నిర్ణయించారు మరియు 1966 లో [[కుంభ మేళా]] ప్రారంభ సమయంలో ప్రయాగ ([[అలహాబాదు|అలహాబాద్]]) వద్ద హిందువుల ప్రపంచ సదస్సు నిర్వహించారు.
 
వి.హెచ్.పి మొదటి చర్చనీయాంశ సమావేశం పవాయ్, సాందీపుని సంధ్యాలయ, బొంబాయిలో 1964 ఆగస్టు 29 న జరిగింది. కృష్ణన్మాష్టమికృష్ణాష్టమి పండుగ నాడు ఏర్పాటుచేసుకున్న ఈ సమావేశానికి ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.యస్.గోల్వాల్కర్ ఆతిథ్యం వహించారు. హిందూ, సిక్కు, బౌద్ధ మరియు జైన మతస్తుల నుండి అనేకమంది ప్రతినిధులు, అలాగే [[దలైలామా]] ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
"భారత మూలాలకు చెందిన అన్ని మత విశ్వాసాలను ఏకం చేయాలి" అని "హిందూ" ("హిందూస్తాన్" ప్రజలు) అనే పదం చెబుతుందని కావున అన్ని మతాలకు చెందిన అనుయాయులకు ఇది వర్తించబడుతుందని గోల్వాల్కర్ వివరించారు.
"https://te.wikipedia.org/wiki/విశ్వ_హిందూ_పరిషత్" నుండి వెలికితీశారు