అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[అమరావతి సంస్థానం]]''' పాలకులుగా వాసిరెడ్డి కమ్మరాజులు కీర్తి గడించారు. [[తీరాంధ్ర]] దేశమును పాలించి ప్రఖ్యాతి గాంచిన రాజవంశములలో వీరిది ఒకటి. ఈ వంశమునకు చెందిన వారందరికీ గల ''చాళుక్య నారాయణ'' అను బిరుదును బట్టి వీరు [[చాళుక్యులు|చాళుక్య]] సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయము.
 
రాజా వేంకటాద్రి నాయుడు గారు [[చింతపల్లి]] నుండి అమరావతికి[[అమరావతి (గ్రామం)|అమరావతి]]<nowiki/>కి రాజధాని మార్చి అమరావతి సంస్థానాన్ని ప్రపంచంలోనే[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే ఒక గొప్ప సంస్థానంగా మలచారు. ఈ సంస్థానంలో [[వజ్రాలు]] విరివిగా వ్యాపారం జరుగుచు ఉండేవి.
 
==చరిత్ర==
 
వాసిరెడ్డి కమ్మరాజుల మొదటి ప్రస్తావన [[పిఠాపురం]]లో దొరికిన క్రీ.శ. 1413 నాటి ఒక [[శాసనము]]లో గలదు. వాసిరెడ్డి పోతినీడు అను రాజు ఈ ప్రాంతమును [[ముసునూరి నాయకులు|ముసునూరి నాయకుల]] సామంతునిగా పాలించినట్టుగా ఉంది. పోతినీడు [[గోదావరి|గోదావరీ]] తీర ప్రాంతములో పలు [[దేవాలయాలు]] కట్టించాడు. 4,60,000 [[తాడి చెట్టు|తాడి చెట్లు]] నాటించి తన శాసనములలో తాడిచెట్ల[[తాటి|తాడిచెట్]]<nowiki/>ల ప్రయోజనాలను పేర్కొన్నాడు.
 
==మల్లికార్జున నాయుడు==
పంక్తి 11:
వంద సంవత్సరాల తర్వాత, క్రీ.శ. 1500 నుండి 1527 వరకు వాసిరెడ్డి మల్లికార్జున నాయుడు పాలించాడు.
 
[[గోల్కొండ]] సుల్తాను [[కులీ కుతుబ్ షా]]కు పన్నులు చెల్లింప నిరాకరించి సుల్తానుతో యుద్ధానికి తలపడ్డాడు. గోల్కొండ సేనాధిపతి హైదర్ జంగ్‌తో జరిగిన పోరులో మల్లికార్జునుడు, హైదరు జంగు ఇద్దరూ మరణించారు. ఈ యుద్ధములో శ్రీశైల ప్రాంతమును పాలిస్తున్నవిజయనగర సామంతుడు రావెళ్ళ మల్లా నాయుడు కూడ పాల్గొన్నాడు. మల్లికార్జునుని రాణి [[సతీసహగమనము]] చేస్తుంది. రెండు సంవత్సరముల వయసున్న [[కొడుకు]] సదాశివ రాయుని కొడాలి రామభూపతి అను బంధువు [[గుంటూరు]] మండలము [[నూతక్కి]] గ్రామములో పెంచుతాడు.
 
==సదాశివ రాయలు==
పంక్తి 21:
పేరు ప్రఖ్యాతులు పొందిన వాసిరెడ్డి వంశస్థులలో చినపద్మనాభ రామన్నఒకడు. క్రీ. శ. 1685లో [[తానీషా]] నుండి 500 గ్రామాలు పొందుతాడు. రామన్న అబుల్ హసన్ తానీషా ను సందర్శించిన ఒక సందర్భములో సుల్తాను మదించిన అశ్వాన్ని లొంగదీయలేక తంటాలు పడుతుండగా రామన్న చూసి, గుర్రాన్ని మచ్చిక చేసుకొని స్వారీ చేసి వస్తాడు. సంతసించిన సుల్తాను రామన్నను నందిగామ, [[ఖమ్మం|ఖమ్మంమెట్టు]], [[వినుకొండ]], [[కొండవీడు]] మొదలైన 500 గ్రామాలకు సర్దేశముఖ్‌గా నియమించాడు. చింతపల్లి కోటను గట్టిపరచి శత్రుదుర్భేద్యము చేస్తాడు. క్రీ. శ. 1710 వరకు పాలన సాగిస్తాడు. తదుపరి రామన్న వారసులు బుచ్చిరాఘవ, పెదనరసన్న, చిననరసన్న, చినరామలింగ, చంద్రమౌళి, రాజమౌళి, లక్ష్మీపతి క్రీ. శ. 1760 వరకు పాలిస్తారు.
 
క్రీ. శ. 1763లో జగ్గయ్య చింతపల్లిని పాలిస్తున్న సమయములో ఫ్రెంచి వారికి బ్రిటిషు వారికి ఆంధ్రదేశముపై ఆధిపత్యము కొరకు సంఘర్షణ మొదలవుతుంది. బ్రిటిషువారికి[[బ్రిటిషు]]<nowiki/>వారికి అనుకూలముగా ఉన్నాడనే అనుమానముతో గోలకొండ నవాబు సోదరుడు [[బసాలత్ జంగ్]] పంపిన ఫ్రెంచి సైన్యముతో తలపడిన జగ్గయ్య యుద్ధములో మరణిస్తాడు. జగ్గయ్య భార్య అచ్చమ్మ సతీసహగమనము చేస్తుంది.
 
==వేంకటాద్రి నాయుడు==
{{ముఖ్య వ్యాసము|వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు}}
వేంకటాద్రి రాజధానిని [[కృష్ణా నది|కృష్ణానది]] ఒడ్డుననున్న గుంటూరు మండలములోని [[అమరావతి]]/[[ధరణికోట]]కు మార్చినాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. [[కృష్ణా డెల్టా]] ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి.
 
 
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు