వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సంస్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యములనేర్చిసాహిత్యములలో ప్రావీణ్యత సాధించి, అభ్యుదయ ధృక్పదముతో విద్యాభ్యాసముచేయనీయని సాటి మహిళల దుర్భరస్తితిగతులను వెలిబుచ్చి చరిత్ర సృష్టించి స్త్రీలకువిద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించిన 19 వ శతాభ్దపు మహిళలు వెలుగులోకివచ్చినవారు బహుకొద్దిమంది మాత్రమే. అట్టి మహిళారత్నములలో నొకరు [[వేమూరి శారదాంబ]](1880-1899). సాంప్రదాయనెపముతో నిబంధనలు, నియమములు విధించి స్త్రీలను గృహబంధితులగ యుంచుట 19వశతాబ్దమునాటి సర్వసాధారణమైన విషయం. అప్పటిసాంఘిక పరిస్తితులలో బాలికలు విద్యనభ్యసించనవసరములేదనీ, సంగీతసాహిత్యములు మొదలగు లలితకళలు స్త్రీలకు తగనివన్న భావనయుండెను. 19 వ శతాబ్దమధ్య కాలములో ప్రవేసించిన సంఘసంస్కరణోద్యమములు తెలుగునాట క్రమేపి ఆదరణపోందెను. సామాజిక నియమ ఉల్లంఘనలకు సంఘబహిష్కరణ, వెలి ప్రాయశ్చిత్తము మొదలగు ఆంక్షలు ఆశతాబ్దపు చివరినాటికింకనూ సాగుచునేయుండెను. స్త్రీలకు విద్యాభ్యాసము, సంగీత సాహిత్యములలో ప్రవేశము అప్పటికింకనూ అరుదుగనేయుండెనని [[చరిత్ర]]<nowiki/>లో కనబడుచున్నది. ఆమె జీవితకాలము కేవలము 19 సంవత్సరములు మాత్రమే. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్పపలుకుబడిగల్గి పురప్రముఖుడైన తన తండ్రి, [[దాసు శ్రీరాములు]] గారి ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించెను. అంతేగాక సంగీత సాహిత్యములలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించెను. చిననాట పిత్రుపరిరక్షణలోనే సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపుపొందినది. ఆనాటి పరిస్తితులకెదురీది మెట్టింటివారి నిరుత్సాహక వాతావారణములో సహితము ప్రబంధకావ్యరచనలు చేసి కవయిత్రిగా పేరుపొందినది. స్త్రీలపట్లగల వివక్షతకు వాపోయి వారి దుర్భర స్తితిగతులుమెరుగు పరచుటకు విద్యాభ్యాసము అనివార్యమని ఘోషించి భగవత్ప్రార్దనా రూపములో కావ్యరచనలు చేసి సాహసించి ప్రచురించిన శారదాంబగారు చిరస్మరణీయులు. <ref> "స్త్రీ జనక్షేమార్ధి శ్రీమతి వేమూరి శారదాంబ" డా. దాసు అచ్యుతరావు(2014) వార్త, హైదరాబాదు శుక్రవారం డిసెంబరు 26, 2014</ref> <ref name="అచ్యుతరావు(2015)"> అలనాటి అభ్యుదయవాది, స్త్రీ విద్యాహితైషిః శ్రీమతి వేమూరి శారదాంబ డా.దాసు అచ్యుతరావు(2015) కిరణసాహితి మాసపత్రిక 28,29. మే 2015</ref>
=జీవిత విశేషములు=
==బాల్యమందే అబ్బిన అపార విద్య==
1881 మే నెల 3 తారీకున ఇప్పటి [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>లోని [[ముదినేపల్లి]] మండలములోని [[అల్లూరు]] గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్ధక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన [[దాసు విష్ణు రావు]], మధుసూధనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. [[తండ్రి]] దాసు శ్రీరాములు(1846-1908) వృత్తిరీత్యా [[ఏలూరు]]<nowiki/>లో న్యాయవాదేగాక అప్పటి ఏలూరు పురపాలకసంఘ అధ్యక్షుడు. జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి దేవీభాగవతమురచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. [[రాజమండ్రి|రాజమహేంద్రవరము]]<nowiki/>లోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, [[కందుకూరి వీరేశలింగం పంతులు]] సమకాలీకుడు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన [[కోమండూరి నరసింహాచారి]], [[ఈమని వెంకటరత్నం]] వద్ద [[సంగీతము]] నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో సంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. [[మైసూరు]], [[బెంగళూరు]] పట్టణములందు జరిగిన సంగీత సమ్మేరములో వీణా వాయిద్య కచేరీ చేశెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ [[పెళ్ళి|వివాహం]] 1888 మే నెల లో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది.
 
=స్వల్పజీవితకాలం, సాహిత్యకృషి=
పంక్తి 8:
 
===మాధవశతకము===
అలనాటి స్త్రీలకు విద్యాభ్యాసములేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల తన వ్యాకులత వ్యక్తముచేయుచు విద్యను ప్రసాదింపుమని భగవంతుని ప్రార్ధన రూపములో శారదాంబగారుశారదాంబ రచించిన కావ్యము మాధవ శతకము.<ref name= "కాత్యాయనీ విద్మహే> "వేమూరి శారదాంబ 'మాధవ శతకం'" కాత్యాయనీ విద్మహే (2017) సంస్కరణోద్యమ భావజాలానికి , మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె నవతెలంగాణా సోపతి ఆదివారం 24 డిసెంబరు 2017. 16,17</ref> దేవలోకములో దేవతా స్త్రీలకు విద్యనభ్యసించుటకెట్టి ఆటంకములేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహబందితులగా చేసి విద్యాభ్యాసరహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసముచేసినంతమాత్రము స్త్రీలు తమ గృహనిర్వాహణ భాద్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపము రాన్నివరని చెప్పుటకు ప్రామాణికముగా విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయవిధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాదవ శతకమునందలి పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయములో అవరోదములు, అభ్యంతరములు ఉపసంహరించుకోమని శారదాంబగారు నైపుణ్యముగా అభ్యర్దించిరి. ఆయా పద్యములలో శారదాంబ ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితోసహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు దేవతాస్త్రీలు విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించిరి. శారదాంబ గారు కావ్యరూపములో స్త్రీల విద్యాభ్యాసమునకు సామాజికాభ్యంతరములు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన దేవతలు, దేవతాస్త్రీల ప్రామాణిక సాక్షాధారములుచూపుతు రచించిన కొన్ని పద్యములు అర్దముతో పాటు డా. దాసు అచ్యుతరావు వ్యాసములో ప్రచురించిరి.<ref name="అచ్యుతరావు(2015)"/>
“స్త్రీల దుస్తితినద్భుతంబుగా బాపి యిద్భువిన్ బన్నుగ నద్భుదుల్ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ ప్రార్దించినది.”
<poem>
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు