వజ్ఝల కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''వజ్ఝల కాళిదాసు''' ప్రముఖ కవి, అవధాని, రచయిత, సంపాదకుడు మరియు ప్రవాసాంధ్రుడు.
==విశేషాలు==
ఇతడు [[1909]], [[మే 13]]వ తేదీకి సరియైన [[సౌమ్య]] నామ సంవత్సర [[వైశాఖ బహుళ అష్టమి]] తిథిలో [[విజయనగరం జిల్లా]], [[బొబ్బిలి]] సమీపంలోని [[పాల్తేరు (విజయనగరం)|పాలతేరు]] గ్రామంలో వజ్ఝల శివశంకరశాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించాడు. ఇతడు తన మాతామహుని ఇంట [[విజయనగరం]]లో వాణిజ్యశాస్త్రంలో ఉన్నతవిద్యను అభ్యసించాడు. ఇతని వంశంలో అందరూ పండితులే. ఇతని ముత్తాత అన్నయ్య వేదవిద్యాపారంగతుడు, మహాకవి. అతడు "యాదవరాఘవపాండవీయం" అనే కావ్యాన్ని రచించాడు. ఇతని తాత సీతారామస్వామి కాళహస్తి సంస్థానంలో దీవాన్‌గా పనిచేశాడు. ఇతనికి వరుసకు తాతగారైన [[వజ్ఝల చిన సీతారామస్వామిచినసీతారామస్వామి శాస్త్రి]] కళాప్రపూర్ణ బిరుదాంకితుడు, కర్ణచరిత్ర, ఆంధ్ర వైయ్యాకరణ పారిజాతము ఇత్యాది గ్రంథ రచయిత. ఇతని మేనమామ కొల్లూరి ధర్మారావు "చాకిరేవు" అనే విమర్శనా గ్రంథరచయిత.
"https://te.wikipedia.org/wiki/వజ్ఝల_కాళిదాసు" నుండి వెలికితీశారు