గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యాపారం: కృష్ణ మేనన్ కు లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[గుత్తికొండ నరహరి]]''' ([[ఆగష్టు 10]], [[1918]] - [[మార్చి 27]], [[1985]]) [[రచయిత]], సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు.
 
==జీవన సరళి==
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన [[గుత్తికొండ]] నరహరి [[ఆగస్టు 10]], [[1918]] న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు [[యలవర్రు]] గ్రామం, [[అమృతలూరు]] మండలం ([[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త [[యలవర్తి నాయుడమ్మ]] అక్కడివాడే. సమీపంలో వున్న [[తురుమెళ్ళ]] పాఠశాలలో చదువుకున్నాడు. [[యలవర్తి రోశయ్య]], [[మల్లంపాటి మధుసూదన ప్రసాద్]] తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే [[బర్మా]] లోని [[రంగూన్]] వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేసి, తిరిగి వచ్చి [[గుంటూరు]] [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]]లో న్యాయశాస్త్రములో చేరి మధ్యలోనే స్వస్తిపలికి, [[ఎం.ఎన్.రాయ్]] ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయ్యాడు. 1944 లో [[గూడవల్లి]] లో, మేనమామ కూతురు సరోజినితో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడింది.
 
==రాజకీయాలు ==
పంక్తి 45:
 
==వ్యాపారం ==
[[గుంటూరు]]లో [[పొగాకు]] కంపెనీ పెట్టి [[వ్యాపారం]] చేశాడు. [[కొత్త రఘురామయ్య]]తో కొన్నేళ్ళు కలసి పనిచేశాడు. అప్పుడే [[వి. కె. కృష్ణ మేనన్]] కు చేరువయ్యాడు. పొగాకు వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభను రచనలకు వినియోగించాడు. కాని అవి ఇప్పుడు లభించడం లేదు. పొగాకు [[వాణిజ్యం]] కోసం కంపెనీల ఆర్డర్లు పొందడానికి తొలుత జపాన్ వెళ్ళాడు. పిమ్మట అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్య పరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు ప్రత్యేక సంచికలలో రాశాడు.
 
==మానవతా వాది ==
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు