జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''డా. జి.వి.కృష్ణరావు''' ([[1914]] - [[ఆగష్టు 23]], [[1979]]) <ref>సాహితీ చైత్రరథం - డా.జి.వి.కృష్ణారావు సాహిత్య సమాలోచన (ప్రత్యేక సంచిక)</ref> [[హేతువాది]], ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా[[రచయిత]]<nowiki/>గా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించాడు. [[గుంటూరు జిల్లా]], [[కూచిపూడి (అమృతలూరు)|కూచిపూడి]] గ్రామములో 1914 లో జన్మించాడు. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]<nowiki/>లో పట్టభద్రుడై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసాడు. [[నాగార్జునుడు|ఆచార్య నాగార్జున]], [[ప్లేటో]], [[ఇమ్మాన్యుయెల్ కాంట్|కాంట్]] ల మీద తాత్విక విచారణా [[గ్రంథాలు]] రాశాడు. [[కళాపూర్ణోదయం]] సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందాడు.
 
==జీవన సంగ్రహం==
గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించాడు. బక్కపలచటి శరీరం, ఆలోచనాత్మకమైన చూపులు, సునిశిత మేధ ఆయన లక్షణాలు. [[తురుమెళ్ళ]], [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] హైస్కూళ్లలో పాఠశాల విద్య అభ్యసించాడు. ఏసి కాలేజి, [[గుంటూరు]] నుండి 1937లో పట్టభద్రులై, [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం]]<nowiki/>లో ఎం. ఏ. 1914లో పూర్తి చేశాడు. [[కాశీ]]<nowiki/>లో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. [[మార్క్స్]] సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే సాహిత్య గ్రంథం వ్రాశాడు.
 
కాలక్రమేణా [[ఎం.ఎన్.రాయ్]] ఉద్యమ ప్రభావానికి లోనయ్యాడు. విగ్రహవ్యావర్తిని అనే తాత్విక [[సంస్కృతము|సంస్కృత]] గ్రంథాన్ని [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించాడు. నాగార్జునాచార్యుని శూన్యవాదాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సరళిని కృష్ణారావు ఆకళింపు చేసుకొన్నాడు. [[ప్లేటో]] ఆదర్శ రాజ్యాన్ని [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడమీ]] వారికి తెలుగులోకి అనువదించాడు.
 
జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య ఈయన ఇతర రచనలు. బొమ్మ ఏడ్చింది, భిక్షా పాత్ర వంటి నాటికలు ఆదర్శ శిఖరాలు అనే పేరుతో సంపుటిగా వెలువరించాడు. [[కీలుబొమ్మలు (నవల)|కీలుబొమ్మలు]] నవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. పాపికొండలు, రాగరేఖలు, జఘన సుందరి వీరి నవలల్లో ప్రసిద్ధాలు. గ్రామీణ జన జీవనాన్ని అద్దంపట్టే కథలు చైత్రరథం పేరుతో సంపుటిగా వేశాడు. ఉదయబిందువులు యితర రచనల సంపుటి. నవ్యతోరణం వేదవ్యాస సంపుటి ప్రకటించాడు.
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు