గుర్రం మల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with ''''గుర్రం మల్లయ్య''' ప్రముఖ చిత్రకారుడు, శిల్పి మరియు స్వాతంత్...' |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 12:
* రాధాకృష్ణ
* కృష్ణార్జున
* గ్రీష్మ సాయంకాలం మొదలైనవి.
ఇతడు కలకత్తాలో శిక్షణ పొందిన తరువాత తిరిగి బందరు వచ్చి జాతీయ కళాశాలలో చిత్రకళాధ్యాపకుడిగా చేరాడు. కళాశాలలో పనిచేస్తున్నప్పుడే గాంధీజీ పిలుపును అందుకుని మద్యపాన నిషేధము, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగులు నిర్వహించడంతో అరెస్టయ్యాడు. నాగార్జునకొండ నుండి కొన్ని అపురూపమైన శిల్పాలను విదేశీయులు తరలించుకు పోవడాన్ని గమనించి ప్రభుత్వానికి రిపోర్టు చేసి ఆ శిల్పసంపద మన దేశం నుండి తరలిపోకుండా కాపాడాడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఇక్ష్వాకుల కాలం నాటి విజయపురి శిథిలాలను, శిల్పాలను నీటిలో మునిగిపోకుండా భద్రపరచవలసిన ఆవశ్యకతను ఇతడు స్వయంగా నాటి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]]కు విన్నవిస్తే నెహ్రూ స్వయంగా పరిశీలించి వాటి నమూనాలు తయారు చేయించి కొండపై మ్యూజియం ఏర్పాటు చేసి వాటిలో ఉంచవలసిందిగా ఆదేశించాడు. నెహ్రూ ఆదేశం ప్రకారం ఇతడే అన్ని నమూనాలు తయారు చేశాడు. నాగార్జున శిల్పకళ ప్రావీణ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఇతడు [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]]తో కలిసి నాగార్జున శిల్పకళా పీఠాన్ని నెలకొల్పి 11 సంవత్సరాలు అనేక మందికి శిక్షణ ఇచ్చి మంచి శిల్పులుగా తయారు చేశాడు.
|