వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

→‎క్రైస్తవ్యం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
'''యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి''' ([[జూలై 8]], [[1949]] - [[సెప్టెంబర్ 2]], [[2009]]) [[ఆంధ్ర ప్రదేశ్]] 16వ ముఖ్యమంత్రి, [[కాంగ్రేసు పార్టీ]] నాయకుడు.
 
[[1978]]లో తొలిసారిగా [[పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం]]నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు [[పులివెందుల]] నుంచి ఎన్నికకాగా, 4 సార్లు [[కడప లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి [[పార్లమెంటు]]లో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య [[ముఖ్యమంత్రి]] పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. [[1999]]లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] గెలుపుకు వ్యూహం రచించాడు. [[2003]]లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు <ref>http://www.kadapa.info/ysr.html</ref> సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. [[2004]] ఎన్నికలలో [[పులివెందుల]] నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన [[సెప్టెంబర్ 2]], [[2009]]న [[చిత్తూరు జిల్లా]]లో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా<ref>ఈనాడు 26-05-2012</ref> అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. "క్విడ్ ప్రో కో " రూపంలో జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 41:
 
===పాదయాత్ర===
2003 వేసవికాలంలో[[వేసవికాలం]]<nowiki/>లో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో [[పాదయాత్ర]] చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అధికారంలోకి రావడానికి దోహదపడింది.
 
===ముఖ్యమంత్రిగా===
2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరుసంపాదించిన [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో [[ముఖ్యమంత్రి]] పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.
 
== వివాదాలు, విమర్శలు==
పంక్తి 53:
 
==కుటుంబం==
వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక [[కొడుకు]], ఒక [[కూతురు]]. కొడుకు [[జగన్మోహన్ రెడ్డి]] ప్రస్తుతం కడప లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన చాలా వ్యాపారాలతో పాటు [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిళ. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది.
గుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు.