వేలు నాచియార్: కూర్పుల మధ్య తేడాలు

"Velu Nachiyar" పేజీని అనువదించి సృష్టించారు
 
చి ప్రింటింగ్ దోషాలు, పేరాల సవరణ.
పంక్తి 2:
 
== జీవితం ==
వేలు నాచియార్ రామనాథపురం ప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మరియు రాణి సకంధిముత్తల్ సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక.
 
నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. విలువిద్య, గుర్రపుస్వారీ, వలరి, సిలంబం వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు, చాలా భాషలలో పండితురాలు. ఫ్రెంచి, ఆంగ్లము ఇంకా ఊర్దూ భాషలు ఆమెకి కరతలామలకం. ఈమెకు శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది.  ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, అర్కాట్ నవాబు కొడుకు కలిసి కైలయార్ కోయిల్ యుద్ధంలో హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికిసన్నద్ధమైంది. కానీ సైన్యం లేకపోవడంతో దిండిగుల్ వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ కొపాల నాయక్కర్ అండలో  తన కుమార్తెతో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.
 
ఈ కాలంలోనే గోపాల్ నాయకర్ మరియు సుల్తాన్ హైదర్ అలీ సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనా నాయికురాలైనకుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది  "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించిందిఎన్నో కష్టాలకోర్చి చివరికి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970 లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి శివగంగ సంస్థానానికి రాణి అయింది.హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది.
పంక్తి 12:
 
== వనరులు ==
* https://sarasabharati-vuyyuru.com/2014/08/11/%E0%B0%9C%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D-%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE/<nowiki/>దస్ఫస్ద్ఫ్<br>
* [[భారత స్వాతంత్ర్యోద్యమము|Indian independence movement]]
* Indian independence activists
"https://te.wikipedia.org/wiki/వేలు_నాచియార్" నుండి వెలికితీశారు